ఈ శుక్రవారం విడుదల కాబోయే ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ మీద క్రమంగా బజ్ పెరుగుతోంది. ఓవర్ మాస్ జోలికి వెళ్లి మాచర్ల నియోజకవర్గంతో షాక్ తిన్న నితిన్ తిరిగి ఎంటర్ టైన్మెంట్ రూటు పట్టాడు. స్టార్ రైటర్ గా కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్స్ కి పని చేసిన వక్కంతం వంశీకి దర్శకుడిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రూపంలో డెబ్యూ చేదు జ్ఞాపకంగా నిలిచింది. అందుకే తన సత్తా చాటేందుకు దీన్నే అవకాశంగా మలుచుకున్నారు. వీళ్ళ సంగతి కాసేపు పక్కనపెడితే హీరోయిన్ శ్రీలీలని హీరోతో సహా టీమ్ బాగా హైలైట్ చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ స్పష్టంగా కనిపించింది.
నితిన్ తన ప్రసంగంలో శ్రీలీలపై మాములు ప్రశంసలు గుప్పించలేదు. ఒక నటిగానే కాకుండా డాక్టర్ గా, డాన్సర్ గా, హాకీ స్విమ్మింగ్ చేసే క్రీడాకారిణిగా ఎంతో ప్రతిభ ఉన్న మల్టీటాలెంటెడని సర్టిఫికెట్ ఇచ్చాడు. భరతనాట్యం, కూచిపూడిలోనూ తన ప్రావీణ్యం గురించి ప్రస్తావించాడు. ఇంత బిజీలోనూ తమకు డేట్స్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు అందజేశాడు. ఆ మధ్య ప్రెస్ మీట్ లో శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన నితిన్ ఆమె ఉండటంని అతి పెద్ద ప్లస్ గా భావిస్తున్నాడు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీలీలకు ఆదికేశవ డిజాస్టర్ చిన్నపాటి కుదుపు ఇచ్చింది.
ఇప్పుడీ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సక్సెస్ కావడం శ్రీలీలకు కీలకమే. కథ ఎక్కువ నితిన్ చుట్టే తిరిగినా ధమాకా తరహాలో తగినన్ని కమర్షియల్ అంశాలు, డాన్స్ చేయడానికి స్కోప్ ఉన్న పాటలు పడ్డాయి. సో ఇవి కనక క్లిక్ అయితే రిపీట్ ఆడియన్స్ ఉంటారనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. హరీష్ జైరాజ్ సంగీతం, జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ తో వేయించిన పలు గెటప్పులు, కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కంటెంట్ మీద నమ్మకంతో కొన్ని జిల్లా కేంద్రాల్లో రెగ్యులర్ గా మొదలయ్యే పదకొండు గంటలకు బదులుగా ఉదయం తొమ్మిదికే షోలు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 5, 2023 10:46 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…