Movie News

ఆచార్య కోసం రెండు డేట్లు – జరిగే పనేనా?

ఆచార్య చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చే వేసవిలో విడుదల చేసేసి తీరాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అయితే ఇంతవరకు నలభై శాతమే షూటింగ్‍ జరుపుకున్న ఈ చిత్రం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. చిరంజీవి నవంబర్‍ నుంచి షూటింగ్‍కి వచ్చేస్తారని కొరటాల శివ నమ్ముతున్నాడు. ఆయన వచ్చేస్తే నవంబర్‍ నుంచి ఏకబిగిన ఫిబ్రవరి వరకు షూటింగ్‍ చేసి, మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్‍ చేసుకుని, ఏప్రిల్‍లో రిలీజ్‍ చేయాలని ప్లాన్‍ చేసుకుంటున్నారు.

ఏప్రిల్‍ 9 అయితే ఈ చిత్రానికి బెస్ట్ డేట్‍ అని కొరటాల శివ భావిస్తున్నాడట. ఒకవేళ అది మిస్‍ అయితే మే 7కి ప్లాన్‍ చేసుకోవచ్చునని ఈ రెండు డేట్లను టార్గెట్‍గా పెట్టుకున్నారు. అయితే అప్పటికి సినిమా వచ్చేదీ లేనిదీ నవంబర్‍లో షూటింగ్‍ మొదలవుతుందా లేదా అనే దానిపై ఆధారపడి వుంటుంది.

పైగా ఈ చిత్రానికి చరణ్‍తో లింక్‍ వుంది. చరణ్‍కి ఇంకా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయడానికి రాజమౌళి నుంచి క్లియరెన్స్ రాలేదు. ఒకవేళ డిసెంబర్‍ నాటికి అయినా షూటింగ్‍ మొదలు కాకపోతే మాత్రం వేసవిలో ఆచార్య రిలీజ్‍ చేయడం కష్టమవుతుంది. అప్పుడు మళ్లీ జులై లేదా ఆగస్ట్ లో మంచి డేట్‍ ఏదైనా చూసుకోవాలి.

This post was last modified on September 1, 2020 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

20 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago