ఇటీవల గోవాలో జరిగిన ఒక సినిమా అవార్డు ఫంక్షన్ లో కొన్ని అవాంతరాలు తలెత్తి కన్నడ నుంచి వచ్చిన నటీనటులకు అసౌకర్యం కలగడం చిన్నపాటి దుమారానికి దారి తీసింది. దాని నిర్వాహకుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిఆర్ఓగా కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరగడంతో నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఒక బ్యానర్ లాంచ్ కి అతిధిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో ఈ ఫంక్షన్ చేస్తున్నాడని, ఈసారి ఫెయిల్ కావడం అతని వ్యక్తిగత బాధ్యత తప్పించి మా కుటుంబానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
నిన్న కొందరు శాండల్ వుడ్ నటీనటులు దీని గురించి ట్వీట్లు పెట్టడంతో అక్కడి పత్రికల్లో మెగా పిఆర్ఓ చేసిన ఫంక్షన్ గా ప్రచారం జరిగింది. దీనికి తోడు వేడుక నిర్వహించిన విధానం పట్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయాన్ని హైలైట్ చేయడంతో క్రమంగా ఈ వివాదం పబ్లిక్ లోకి వచ్చేసింది. ఏవో బిల్లుల చెల్లింపులో జరిగిన ఆలస్యం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పాటు హోటల్ వ్యయం సమయానికి జమ చేయకపోవడం వల్ల రభసకు దారి తీసిందని అంటున్నారు. సదరు వ్యక్తి గురించి పేరు కానీ, ఇంకే ఇతర వివరాలు కానీ అల్లు అరవింద్ నేరుగా ప్రస్తావించలేదు.
ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక ప్రైవేట్ వేడుకని టాలీవుడ్ కు ఆపాదించడం కరెక్ట్ కాదు అనేది అరవింద్ గారి వెర్షన్. ఇందులో న్యాయముంది. ఇది మా అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేస్తున్న ఈవెంట్ కాదు. పోనీ ఈఫా, ఫిలిం ఫేర్ లాంటివి అయితే వాటి వ్యవహారం ప్రొఫెషనల్ గా ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. అల్లు అరవింద్ స్వయంగా చెప్పాక ఆయన వివరణ వీడియో రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయినా బయట రాష్ట్రాల్లో ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.
This post was last modified on December 4, 2023 4:13 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…