చాడ్విక్ బోస్మన్.. రెండు రోజుల కిందట ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని విషాదంలో ముంచెత్తి తుది శ్వాస విడిచిన హాలీవుడ్ నటుడు. అతడి వయసు 43 ఏళ్లు మాత్రమే. నాలుగేళ్ల కిందట పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడిన అతను.. దాంతో పోరాడుతూనే సినిమాలు చేస్తూ వెళ్లాడు. కొన్ని నెలల కిందటే అతడి క్యాన్సర్ నాలుగో దశకు చేరుకుంది. చివరికి ఈ పోరాటంలో అతను ఓడిపోయాడు.
నాలుగేళ్ల కిందట క్యాన్సర్ బయటపడినపుడే అది మూడో దశలో ఉంది. అలాంటి స్థితిలో ఇంకెవరైనా అయితే సినిమాలు మానేసి చికిత్స మీదే దృష్టిపెడతారు. కానీ అతను మాత్రం సినిమాలు ఆపలేదు. ‘బ్లాక్పాంథర్’ లాంటి బ్లాక్బస్టర్ మూవీలో నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంత హుషారుగా కనిపించాడో అందరికీ తెలిసిందే.
లోపల ఎంతో బాధను, నొప్పిని దాచుకుని అతను అంత హుషారుగా సినిమాల్లో నటించడం, బయట కూడా చాలా ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన క్యాన్సర్ వ్యాధి గురించి అత్యంత సన్నిహితులకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా చూసుకున్నాడతను.
అతడి వ్యక్తిగత జీవితం గురించి సామాన్య జనాలకు పెద్దగా తెలియదు. తాజాగా బోస్మన్ గురించి మరో ఆశ్చర్యకర విషయం బయటపడింది. అతను ఇంకొన్ని నెలల్లో తాను చనిపోబోతున్నానని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు.
గత ఏడాది అక్టోబరులో అతడికి గాయని సైమోన్ టేలర్తో నిశ్చితార్థం జరిగింది. అప్పటికే అతడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కొన్ని నెలల కిందటే అతడికి పెళ్లి జరిగింది. అప్పటికి తానింక బతికేది కొన్ని నెలలే అని అతడికి అర్థమైంది. అయినా సరే.. సైమోన్ను పెళ్లాడాడు. ఆమె కూడా విషయం అంతా తెలిసి అతణ్ని పెళ్లి చేసుకుంది. బోస్మన్ చనిపోయే సమయంలో ఆమె అతడి పక్కనే ఉందని కుటుంబం వెల్లడించింది.
This post was last modified on August 31, 2020 4:50 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…