ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఆగిపోయాయి కానీ.. ఒకప్పుడు అర్ధరాత్రి 1-2 గంటల మధ్య.. తెల్లవారుజామున 4-5 గంటలకు షోలు పడిపోయేవి. పెద్ద హీరోల క్రేజీ సినిమాలకు విడుదల రోజు ఈ షోలు ఉండేవి. ఇప్పుడు ఉదయం 6-7 గంటలకు షోలు మొదలవుతున్నాయి. కానీ ఆ డిమాండ్ తొలి రోజు మాత్రమే ఉంటోంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమాకు శనివారం అర్ధరాత్రి తర్వాత షోలు షెడ్యూల్ కావడం.. అవన్నీ ఫుల్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముంబైలో అనేక మల్టీప్లెక్స్ లు వీకెండ్ డిమాండ్ తట్టుకోలేక అర్ధరాత్రి పదుల సంఖ్యలో షోలు షెడ్యూల్ చేశాయి.
11.30, 12.00, 12.30, 1.00,1.30, 2.00 ఈ టైమింగ్స్ లో పగటిపూట షోలు మామూలే కానీ.. అర్ధరాత్రి వేళ ఈ టైమింగ్స్ లో షోలు పెద్ద సంఖ్యలో హౌస్ ఫుల్ తో రన్ అవ్వడం అరుదైన విషయం. మల్టీప్లెక్స్ లకు 24 గంటలు షోలు నడిపించుకునే అనుమతి ఉండడంతో పివిఆర్ సహా పలు థియేట్రికల్ చైన్స్ అర్ధరాత్రి షోలు నడిపిస్తున్నాయి. మిడ్ నైట్ షోలు అయ్యాక ఒకటి రెండు గంటల గ్యాప్ లోనే ఉదయం 6 నుంచి రెగ్యులర్ షోలు షెడ్యూల్ కావడం విశేషం. యానిమల్ మూడున్నర గంటల సినిమా కావడంతో షోలు ఆడించినా గరిష్టంగా ఆరుకు మించట్లేదు. మల్టీప్లెక్స్ సిబ్బంది షిఫ్టుల మీద 24 గంటలు పని చేయాల్సి వస్తోంది.
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…