ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఆగిపోయాయి కానీ.. ఒకప్పుడు అర్ధరాత్రి 1-2 గంటల మధ్య.. తెల్లవారుజామున 4-5 గంటలకు షోలు పడిపోయేవి. పెద్ద హీరోల క్రేజీ సినిమాలకు విడుదల రోజు ఈ షోలు ఉండేవి. ఇప్పుడు ఉదయం 6-7 గంటలకు షోలు మొదలవుతున్నాయి. కానీ ఆ డిమాండ్ తొలి రోజు మాత్రమే ఉంటోంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమాకు శనివారం అర్ధరాత్రి తర్వాత షోలు షెడ్యూల్ కావడం.. అవన్నీ ఫుల్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముంబైలో అనేక మల్టీప్లెక్స్ లు వీకెండ్ డిమాండ్ తట్టుకోలేక అర్ధరాత్రి పదుల సంఖ్యలో షోలు షెడ్యూల్ చేశాయి.
11.30, 12.00, 12.30, 1.00,1.30, 2.00 ఈ టైమింగ్స్ లో పగటిపూట షోలు మామూలే కానీ.. అర్ధరాత్రి వేళ ఈ టైమింగ్స్ లో షోలు పెద్ద సంఖ్యలో హౌస్ ఫుల్ తో రన్ అవ్వడం అరుదైన విషయం. మల్టీప్లెక్స్ లకు 24 గంటలు షోలు నడిపించుకునే అనుమతి ఉండడంతో పివిఆర్ సహా పలు థియేట్రికల్ చైన్స్ అర్ధరాత్రి షోలు నడిపిస్తున్నాయి. మిడ్ నైట్ షోలు అయ్యాక ఒకటి రెండు గంటల గ్యాప్ లోనే ఉదయం 6 నుంచి రెగ్యులర్ షోలు షెడ్యూల్ కావడం విశేషం. యానిమల్ మూడున్నర గంటల సినిమా కావడంతో షోలు ఆడించినా గరిష్టంగా ఆరుకు మించట్లేదు. మల్టీప్లెక్స్ సిబ్బంది షిఫ్టుల మీద 24 గంటలు పని చేయాల్సి వస్తోంది.
This post was last modified on December 2, 2023 11:50 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…