ఇష్టం అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి 13బి అనే వెరైటీ థ్రిల్లర్ మూవీతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. అప్పట్నుంచి అతను వైవిధ్యమైన సినిమాలే తీస్తున్నాడు. ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్… ఇలా ఏ చిత్రం తీసుకున్నా బాక్స్ ఆఫీస్ ఫలితం పక్కన పెడితే విక్రమ్ సినిమా అంటే ఏదో ఒక వెరైటీ ఉంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
కానీ థాంక్యూ అనే సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అందులో ఏమాత్రం విక్రమ్ మార్కు కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇంత సాధారణమైన కథను విక్రమ్ ఎలా టేకప్ చేశాడు అని అందరూ షాక్ అయ్యారు. అయితే నిజానికి అది విక్రమ్ సొంత కథ కాదు. దానికి స్క్రిప్ట్ అందించింది బీవీఎస్ రవి. ఒక ఐడియాకు ఎగ్జిట్ అయి విక్రమ్ తీసిన ఈ సినిమా కాస్ట్లీ మిస్టేక్ అయింది.
థాంక్యూ చిత్రం విక్రమ్ పేరును కూడా కొంతమేర చెడగొట్టింది. తర్వాత అతని ఎలా పుంజుకుంటాడా అని అందరూ ఎదురు చూశారు. అయితే థాంక్యూ హీరో నాగచైతన్యతోనే విక్రమ్ తీసిన వెబ్ సిరీస్ దూత తనేంటో రుజువు చేసింది. విక్రమ్ సొంత కథతో తయారు అయిన సిరీస్. 13బి.. మనం.. 24.. సినిమాల కోవలోనే సూపర్ నేచురల్ కథకు తన మార్కు స్క్రీన్ ప్లే జోడించి ఈ సిరీస్ ను ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దాడు విక్రమ్ కుమార్. అడుగడుగునా దర్శకుడి ప్రతిభ కనిపించింది. రచయితగాను విక్రమ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఈ సిరీస్ చూసిన వాళ్లంతా ఇది కదా విక్రమ్ కుమార్ అంటే అనుకుంటున్నారు. తొలిసారిగా చైతుతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయించి మెప్పించడం ఇందులో మరో స్పెషాలిటీ. మొత్తానికి విక్రమ్ తిరిగి ట్రాక్ ఎక్కడంతో అతడి నుంచి మళ్లీ ఒక వైవిద్యమైన సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on December 2, 2023 11:20 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…