నిన్న విడుదలైన యానిమల్ చూసిన వాళ్లలో చాలా ప్రేక్షకులకు మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్న కంటే కథలో కీలక మలుపుకు కారణమై, రన్బీర్ కపూర్ తో ఒక బోల్డ్ సీన్ లో కూడా నటించిన జోయా అలియాస్ త్రిప్తి డిమ్రీ బాగా నచ్చేసింది. సింపుల్ లుక్స్ తో ఒకరకమైన సెక్సీ అప్పీల్ తో దర్శకుడు సందీప్ వంగా కోరుకున్న ఎక్స్ ప్రెషన్స్ చక్కగా పండించిన ఈ నటి ఎవరబ్బా అనే సందేహం మిగిలిపోయింది. అదేంటో చూద్దాం. ఈ అమ్మాయి 2017లో పోస్టర్ బాయ్స్ తో ఇండస్ట్రీకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లైలా మజ్నులో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది.
ఇవి రెండు అంతగా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. 2020లో చేసిన ఓటిటి డెబ్యూ బుల్ బుల్ పేరునే కాదు అవార్డులు కూడా తీసుకొచ్చింది. గత ఏడాది టైటిల్ రోల్ చేసిన ఖలా సైతం విమర్శకుల మెప్పు పొందిందే. ఫోర్బ్స్ ఆసియా లిస్టు 2021లో చోటు సంపాదించుకోవడం త్రిప్తి డిమ్రీ అచీవ్ మెంట్లలో ఒకటి. రెడిఫ్ డాట్ కామ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా తను కామన్ థియేటర్ ఆడియన్స్ దృష్టిలో అంతగా లేదు. కానీ యానిమల్ చూశాక మాత్రం ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. చిన్న పాత్రే అయినా ఇంపాక్ట్ అలా ఉంది.
ఉత్తరాఖండ్ కు చెందిన త్రిప్తి డిమ్రీకి అనిమల్ పుణ్యమాని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మేరె మెహబూబ్ మేరె సనమ షూటింగ్ పూర్తి చేసుకోగా విక్కీ విద్యా కా నోవాలా వీడియో సెట్స్ మీదున్నాయి. ట్విస్ట్ ఏంటంటే తాజాగా తమిళ తెలుగు నుంచి కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయట. సపోర్టింగ్ పాత్ర అందులోనూ రన్బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి పవర్ హౌస్ ల మధ్య చేస్తున్నప్పుడు ఐడెంటిటీ రావడం కష్టం. అలాంటిది ఇంత తక్కువ లెన్త్ తోనూ త్రిప్తి డిమ్రీ హైలైట్ అవ్వడం చూస్తే ఏదో అదృష్టం దశ తిరిగిన టైంలో సందీప్ వంగా కళ్ళలో పడ్డట్టుంది.
This post was last modified on December 2, 2023 11:25 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…