ప్రస్తుతం టాలీవుడ్ లో బయటికి కనిపించని ఒక విధమైన అనిశ్చితి రాజ్యమేలుతోంది. బయటికి చెప్పుకోవడం లేదు కానీ నిర్మాతలు, హీరోలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి కళ్ళముందే ఆధారాలున్నాయి. అధికారికంగా అనౌన్స్ చేసిన పెద్ద హీరో సినిమాని చెప్పా పెట్టకుండా రద్దు చేయడం ఇందులో భాగంగా జరిగిందే. ఈ నేపథ్యంలో హీరో నితిన్ తండ్రి, నిర్మాత కం పంపిణీదారులు సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎలాంటి మార్పులు అవసరమో సూచిస్తున్నాయి. ఎక్స్ ట్రాడినరి సాంగ్ లాంచ్ లో భాగంగా టీమ్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగానే సదరు ప్రస్తావన వచ్చింది.
దాని ప్రకారం ఆయన వెర్షన్ ఇలా ఉంది. ఓటిటిలు సంవత్సరానికి తమకు కావాల్సిన ముఖ్యమైన పన్నెండు సినిమాలు కొనేసుకున్నాయి. ఎప్పుడో రెండేళ్ల తర్వాత వచ్చే పెద్ద హీరోలవి ఇప్పుడే అడుగుతున్నారు. దీని వల్ల మీడియం బడ్జెట్ చిత్రాలకు చిక్కొచ్చింది. మొన్నటి దాకా ముప్పై కోట్లు పలికిన నితిన్ మూవీని ఇప్పుడు పాతికకే అడుగుతున్నారు. రేపు ఇరవైకి దిగొచ్చు. ఇకపై ప్రొడ్యూసర్లు జాగ్రత్త పడి ఖర్చులు తగ్గించుకోకపోతే ఇబ్బంది తప్పదు. అందరూ తగ్గాల్సిందే. మనమే హైప్ చేసుకుని, మనమే పెంచుకుని, మనమే పోతామంటే ఎవరేం చేయలేరు.
నిజానికి సుధాకర్ రెడ్డి అన్న మాటలు వాస్తవిక కోణంలో ఉన్నవే. కేవలం డిజిటల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆకాశమే హద్దుగా హీరోల రెమ్యునరేషన్లు పెరగడంతో పాటు నిర్మాతలు సైతం మితిమీరిన ఖర్చుకి తెగబడటం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. హక్కుల రూపంలో ఆదాయం వస్తోందని కంటెంట్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమంగా నష్టపోతున్నది ఎవరు. ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకుని హద్దుల్లో ఉంటే స్లంప్ ని చక్కదిద్దవచ్చు. అలా కాకుండా మేమింతే అనే ధోరణి ఉంటే మాత్రం ఇంకా దిగజారిపోతోంది. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ నితిన్ స్వంత బ్యానర్ లో రూపొందిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 2, 2023 4:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…