ప్రస్తుతం టాలీవుడ్ లో బయటికి కనిపించని ఒక విధమైన అనిశ్చితి రాజ్యమేలుతోంది. బయటికి చెప్పుకోవడం లేదు కానీ నిర్మాతలు, హీరోలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి కళ్ళముందే ఆధారాలున్నాయి. అధికారికంగా అనౌన్స్ చేసిన పెద్ద హీరో సినిమాని చెప్పా పెట్టకుండా రద్దు చేయడం ఇందులో భాగంగా జరిగిందే. ఈ నేపథ్యంలో హీరో నితిన్ తండ్రి, నిర్మాత కం పంపిణీదారులు సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎలాంటి మార్పులు అవసరమో సూచిస్తున్నాయి. ఎక్స్ ట్రాడినరి సాంగ్ లాంచ్ లో భాగంగా టీమ్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగానే సదరు ప్రస్తావన వచ్చింది.
దాని ప్రకారం ఆయన వెర్షన్ ఇలా ఉంది. ఓటిటిలు సంవత్సరానికి తమకు కావాల్సిన ముఖ్యమైన పన్నెండు సినిమాలు కొనేసుకున్నాయి. ఎప్పుడో రెండేళ్ల తర్వాత వచ్చే పెద్ద హీరోలవి ఇప్పుడే అడుగుతున్నారు. దీని వల్ల మీడియం బడ్జెట్ చిత్రాలకు చిక్కొచ్చింది. మొన్నటి దాకా ముప్పై కోట్లు పలికిన నితిన్ మూవీని ఇప్పుడు పాతికకే అడుగుతున్నారు. రేపు ఇరవైకి దిగొచ్చు. ఇకపై ప్రొడ్యూసర్లు జాగ్రత్త పడి ఖర్చులు తగ్గించుకోకపోతే ఇబ్బంది తప్పదు. అందరూ తగ్గాల్సిందే. మనమే హైప్ చేసుకుని, మనమే పెంచుకుని, మనమే పోతామంటే ఎవరేం చేయలేరు.
నిజానికి సుధాకర్ రెడ్డి అన్న మాటలు వాస్తవిక కోణంలో ఉన్నవే. కేవలం డిజిటల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆకాశమే హద్దుగా హీరోల రెమ్యునరేషన్లు పెరగడంతో పాటు నిర్మాతలు సైతం మితిమీరిన ఖర్చుకి తెగబడటం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. హక్కుల రూపంలో ఆదాయం వస్తోందని కంటెంట్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమంగా నష్టపోతున్నది ఎవరు. ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకుని హద్దుల్లో ఉంటే స్లంప్ ని చక్కదిద్దవచ్చు. అలా కాకుండా మేమింతే అనే ధోరణి ఉంటే మాత్రం ఇంకా దిగజారిపోతోంది. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ నితిన్ స్వంత బ్యానర్ లో రూపొందిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 2, 2023 4:49 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…