ఇటీవలే తీవ్ర వివాదానికి దారి తీసిన మన్సూర్ అలీ ఖాన్ కామెంట్ల వ్యవహారం చాలా దూరం వెళ్లడం చూశాం. త్రిష మీద హద్దులు మీరి మాట్లాడి, తర్వాత విమర్శలు వచ్చాక సారీ చెప్పి, ఒక్క రోజు గడవటం ఆలస్యం కేసులు పెడతానని మళ్ళీ రచ్చకెక్కడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాంట్రావర్సి కొనసాగుతున్న టైంలో చిరంజీవి ట్విట్టర్ వేదికగా త్రిషకు మద్దతు పలికి ఈ ఘటనను తీవ్రంగా ఖండించడం తెలిసిందే. ఇక్కడితో మన్సూర్ ఊరుకోలేదు. ఏకంగా ఇరవై కోట్లు డిమాండ్ చేస్తూ మెగాస్టార్ మీద పరువు నష్టం దావా వేసి ఆ వచ్చిన డబ్బును పేదలకు సహాయం చేసేందుకు వాడతానని ఏదేదో అన్నాడు.
ఇదంతా జరిగే పని కాదు కానీ మన్సూర్ కేవలం పబ్లిసిటీ పిచ్చితో ఇదంతా చేశాడనేది చెన్నై వర్గాల కామెంట్. ఇదిలా ఉండగా చిరు ప్రత్యేకంగా త్రిషకు సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఆమె విశ్వంభరలో ఒక హీరోయిన్ గా ఎంపికవ్వడమేననే మాట ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. క్యాస్టింగ్ ని అధికారికంగా ప్రకటించలేదు. రానా విలన్ గా కన్ఫర్మ్. అనుష్క కూడా ఉన్నట్టే. త్రిష మరో జోడని చెబుతున్నారు. ఇవన్నీ తేలిగ్గా చెప్పే విషయాలు కాదు కాబట్టి సమయం కోసం వేచి చూస్తన్నారు.
ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే చిరంజీవి తనకు కో స్టార్ కాబోతున్న త్రిషను నైతిక మద్దతు ఇవ్వడం ద్వారా ఉత్తి పుణ్యనా మన్సూర్ అలీ ఖాన్ తో ఆధారాల్లేని ఆరోపణలు పడాల్సి వస్తోంది. సరే దీని వల్ల ఆయన ఇమేజ్, పేరు ప్రతిష్టలకు వచ్చిన మచ్చేమి లేదు కానీ అటుపక్క అతను మాత్రం పదే పదే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ప్రస్తావన తెస్తూ వైరల్ గా మారుతున్నాడు. ఒకవేళ ఈ గొడవ ముదిరినా కూడా చిరు మౌనంగా ఉండటం బెటర్. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నప్పుడు స్పందిస్తే తిరిగి దాన్నీ మళ్ళీ పబ్లిసిటీ అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వదిలేస్తే ఏ గొడవా ఉండదు.
This post was last modified on November 29, 2023 4:04 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…