తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, కంటెంట్ తో మెప్పించి వందల కోట్ల గ్రాసర్ ఇచ్చిన హీరో కం దర్శకుడిగా రిషబ్ శెట్టికి దాని పుణ్యమాని మన దగ్గర కూడా గుర్తింపు వచ్చేసింది. రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజైనా అది సృష్టించిన సంచలనం ప్రేక్షకుల కన్నా ఎక్కువగా బయ్యర్లు అంత సులభంగా మర్చిపోలేరు. మొదటి భాగానికి కేవలం పదహారు కోట్లు ఖర్చు పెట్టిన హోంబాలే ఫిలింస్ ఇప్పుడీ సీక్వెల్ కి వంద కాదు అంతకు మించి ఎంతైనా సరే బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇటీవలే రిషబ్ శెట్టి 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా ప్రెస్ మీట్ లో మాట్లాడ్డం హాట్ టాపిక్ అయ్యింది.
పలు ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ తాను కొందరి లాగా ఒక హిట్టు రాగానే కన్నడ సీమను వదిలిపోనని చెప్పడం ఆసక్తి రేపింది. ప్రత్యేకంగా ఫలానా పేర్లు ప్రస్తావించకపోయినా వాటిని నెటిజెన్లు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరోయిన్ రష్మిక మందన్నకు ఆపాదిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం స్వంత బాష కంటే బయట సినిమాలతో బిజీ అయిపోయింది ఈ ఇద్దరే. నీల్ వరసగా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లతో ప్లాన్ చేసుకోగా రష్మిక హిందీ, తెలుగు, నటించబోయే హీరోని బట్టి తమిళ సినిమాలు మాత్రమే చేస్తోంది. కాబట్టి ఈ అన్వయింపు వీళ్ళ గురించేనని కామెంట్.
ఇక ఓటిటిలు కన్నడ చిత్రాలను కొనడం లేదని చెప్పిన రిషబ్ శెట్టి ఇకపై క్వాలిటీ కంటెంట్ మీద అందరూ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చాడు. నిజానికి ఈ సమస్య ఉంది. తెలుగు, తమిళంలాగా కాకుండా వాటి రీచ్ తక్కువ కావడంతో ఓటిటిలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కెజిఎఫ్, కాంతారా, 777 చార్లీ తర్వాత మార్కెట్ రేంజ్ పెరిగినప్పటికీ వాటికి సరితూగే సినిమాలు చేయడంలో ఇతర హీరోలు తడబడుతున్నారు. పైగా ఓవర్సీస్ మార్కెట్ లో ఎవరికీ గ్రిప్ లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నాణ్యత పెరగాలి. తమ పరిశ్రమను చూసే దృక్పథంలోనూ మార్పు రావాలనేది రిషబ్ శెట్టి ప్రశ్న.
This post was last modified on November 29, 2023 11:51 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…