గత ఏడాది ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్. ‘హుషారు’ లాంటి యూత్ ఫుల్ మూవీతో హిట్ కొట్టిన హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాను సూపర్ అనలేం. అలా అని తీసిపడేయనూలేం. ఆశిష్లో మంచి ఈజ్ ఉందనే పేరొచ్చింది ఈ సినిమాతో.
తర్వాత ఆశిష్ ‘సెల్ఫిష్’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘లవ్ టుడే’తో అందరి దృష్టిలో పడ్డ తమిళ హీరోయిన్ ఇవానా ఇందులో ఆశిష్కు జోడీగా ఎంపికైంది. దిల్ రాజు బేనర్లోనే కాశీ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. కొన్ని నెలల కిందటే ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. షూటింగ్ కూడా చకచకా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో ఏమైందో ఏమో ఈ సినిమాను తాత్కాలికంగా ఆపారు అనే వార్త బయటికి వచ్చింది.
స్క్రిప్టు అంతా బాగానే ఉన్నప్పటికీ టేకింగ్ విషయంలో ఏదో తేడా వచ్చిందని అంటున్నారు. దర్శకుడు కొత్తవాడు కావడం, అనుభవం లేకపోవడంతో టేకింగ్ పరంగా ఇబ్బంది పడ్డాడంటున్నారు. స్క్రిప్టు మీద ఉన్నది తెర మీదికి అనుకున్నంత బాగా రాలేదట. బడ్జెట్ పరంగా ఏ రకమైన ఇబ్బందులూ లేకపోయినప్పటికీ.. ఒక ఫీచర్ ఫిలింలో కనిపించాల్సిన రిచ్నెస్ రాలేదని తెలుస్తోంది. దర్శకుడు కాశీ సుకుమార్ అసిస్టెంట్ కావడం గమనార్హం. కొన్నేళ్ల నుంచి సుక్కు శిష్యుల ఆధిపత్యం నడుస్తోంది టాలీవుడ్లో. ఆయన అసిస్టెంట్ అంటే నమ్మకంగా సినిమా ఇస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు ‘ఉప్పెన’తో సంచలనం రేపి ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడు. కాశీ కూడా టాలెంటెడ్ అన్నది సుక్కు టీం మాట.
ఐతే అనుభవ లేమితో కొంచెం తడబడి ఉండొచ్చు. ఈ సినిమాను సరి చేయడానికి సుక్కు రంగంలోకి దిగనున్నారట. తన శిష్యుడి సినిమా ఆగిందంటే సుక్కుకి కూడా ఇబ్బందే. అందుకే ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొంచెం వీలు చేసుకుని ఈ సినిమా రష్ చూడబోతున్నారట. స్క్రిప్ట్, టేకింగ్ పరంగా కరెక్షన్లు సూచించి.. సినిమాను తిరిగి పట్టాలెక్కించడానికి ఆయన ఒక చేయి వేయబోతున్నట్లు సమాచారం.
This post was last modified on November 28, 2023 2:10 pm
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…