రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి గొప్ప ప్రశంస అందుకుంటే.. అదొక సర్టిఫికెట్ లాంటిదే. అలాంటి మేటి దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఫిలిం మేకింగ్ రూపు రేఖలను మార్చిన దర్శకుడు అంటూ సందీప్ రెడ్డిని కొనియాడాడు రాజమౌళి.
”కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. పెద్ద సినిమాలు తీస్తారు. సూపర్ హిట్లు కొడతారు. చాలా పేరుసంపాదిస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రేక్షకులను, ఇండస్ట్రీనే కాక.. సినిమా అంటే ఇలాగే తీయాలి అనే ఫార్ములాలను కూడా షేక్ చేసే దర్శకులు వస్తారు. మా తరంలో నాకు తెలిసి అలాంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే అనుకుంటా. దాని తర్వాత సందీప్ రెడ్డినే కనిపించాడు. సినిమాకు సంబంధించి అన్ని నార్మ్స్, ఫార్ములాలను పక్కన పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తా అని చాటిన దర్శకుడు సందీప్ రెడ్డి. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు బ్రదర్” అంటూ సందీప్ను ప్రశంసల్లో ముంచెత్తాడు రాజమౌళి. ఈ మాటలతో సందీప్ కూడా అమితానందానికి గురయ్యాడు.
మరోవైపు యానిమల్ రణబీర్ కపూర్ను తన పక్కకు రప్పించి.. నీకు సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టమా అని అడగ్గా.. అతను ఔనని సమాధానం ఇచ్చాడు. తర్వాత రాజమౌళి కొనసాగిస్తూ.. నీకు ఒకే ఒక్క సినిమా చేసే అవకాశం ఉందంటే నాతో చేస్తావా.. సందీప్ రెడ్డితో చేస్తావా అని అడిగాడు. దీనికి రణబీర్ బదులిస్తూ.. రోజుకు రెండు షిఫ్టుల్లో రెండు సినిమాలూ చేస్తానని లౌక్యంతో బదులిచ్చాడు. కానీ అలా కాదు, ఒక్కరితోనే అంటే ఎవరితో చేస్తావని అడిగితే.. నేను సందీప్ రెడ్డినే ఎంచుకుంటా అని రణబీర్ చెప్పగా.. ఆడిటోరియం హోరెత్తింది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…