యానిమల్ కథను విన్న ఎవ్వరైనా ఈజీగా రిజెక్ట్ చేస్తారని.. కానీ రణబీర్ కపూర్ మాత్రం తనను నమ్మి ఈ సినిమా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నాడు. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సందీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా రన్ టైం గురించి ఆందోళన అక్కర్లేదని అతనన్నాడు. యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సందీప్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పర్టికులర్గా మాట్లాడాడు.
”లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. ప్రతి ఫ్రేమ్నూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రణబీర్ కపూర్తో పాటు అనిల్ సార్, బాబీ డియోల్ సాగర్, రష్మిక లాంటి గొప్ప నటులు సినిమాలో ఉన్నారు. అర్జున్ రెడ్డిలో అమ్మాయి వెనక్కి రాగానే కథ సుఖాంతం అయిపోయింది. కానీ ఈ కథ సుఖాంతం కాదు. డిసెంబరు 1న థియేటర్లకు రండి. ఈ సినిమా చూసినపుడు కలిగే అనుభూతి ఇంతకుముందు ఎప్పుడూ కలిగి ఉండదు. ఆ మేరకు హామీ ఇవ్వగలను.
నిజానికి ఈ కథను ఎవరైనా కూడా.ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. లాజిక్కులు లేవా? డ్రామా ఏంటి ఇలా ఉందని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. కానీ రణబీర్ నన్ను నమ్మాడు. నాతో ట్రావెల్ అయ్యాడు. ఈ రోజే యానిమల్ కలర్ గ్రేడింగ్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. అలాగే సినిమాలో ఆరంభం మిస్ కావద్దు. ముగింపు కూడా మిస్ అవ్వొద్దు. ఇదేదో మొత్తం చూడాలని చెప్పట్లేదు. నేనొక గొప్ప తండ్రీ కొడుకుల కథను తీశాననుకుంటున్నా. సినిమా మీద నేనెంతో నమ్మకంతో ఉన్నా. మీరు కూడా అది చూసి ఎంజాయ్ చేస్తారు. డిసెంబరు 1న కలుద్దాం” అని సందీప్ ముగించాడు.
This post was last modified on November 28, 2023 6:22 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…