యానిమల్ కథను విన్న ఎవ్వరైనా ఈజీగా రిజెక్ట్ చేస్తారని.. కానీ రణబీర్ కపూర్ మాత్రం తనను నమ్మి ఈ సినిమా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నాడు. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సందీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా రన్ టైం గురించి ఆందోళన అక్కర్లేదని అతనన్నాడు. యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సందీప్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పర్టికులర్గా మాట్లాడాడు.
”లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. ప్రతి ఫ్రేమ్నూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రణబీర్ కపూర్తో పాటు అనిల్ సార్, బాబీ డియోల్ సాగర్, రష్మిక లాంటి గొప్ప నటులు సినిమాలో ఉన్నారు. అర్జున్ రెడ్డిలో అమ్మాయి వెనక్కి రాగానే కథ సుఖాంతం అయిపోయింది. కానీ ఈ కథ సుఖాంతం కాదు. డిసెంబరు 1న థియేటర్లకు రండి. ఈ సినిమా చూసినపుడు కలిగే అనుభూతి ఇంతకుముందు ఎప్పుడూ కలిగి ఉండదు. ఆ మేరకు హామీ ఇవ్వగలను.
నిజానికి ఈ కథను ఎవరైనా కూడా.ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. లాజిక్కులు లేవా? డ్రామా ఏంటి ఇలా ఉందని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. కానీ రణబీర్ నన్ను నమ్మాడు. నాతో ట్రావెల్ అయ్యాడు. ఈ రోజే యానిమల్ కలర్ గ్రేడింగ్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. అలాగే సినిమాలో ఆరంభం మిస్ కావద్దు. ముగింపు కూడా మిస్ అవ్వొద్దు. ఇదేదో మొత్తం చూడాలని చెప్పట్లేదు. నేనొక గొప్ప తండ్రీ కొడుకుల కథను తీశాననుకుంటున్నా. సినిమా మీద నేనెంతో నమ్మకంతో ఉన్నా. మీరు కూడా అది చూసి ఎంజాయ్ చేస్తారు. డిసెంబరు 1న కలుద్దాం” అని సందీప్ ముగించాడు.
This post was last modified on November 28, 2023 6:22 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…