యానిమల్ కథను విన్న ఎవ్వరైనా ఈజీగా రిజెక్ట్ చేస్తారని.. కానీ రణబీర్ కపూర్ మాత్రం తనను నమ్మి ఈ సినిమా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నాడు. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సందీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా రన్ టైం గురించి ఆందోళన అక్కర్లేదని అతనన్నాడు. యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సందీప్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పర్టికులర్గా మాట్లాడాడు.
”లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. ప్రతి ఫ్రేమ్నూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రణబీర్ కపూర్తో పాటు అనిల్ సార్, బాబీ డియోల్ సాగర్, రష్మిక లాంటి గొప్ప నటులు సినిమాలో ఉన్నారు. అర్జున్ రెడ్డిలో అమ్మాయి వెనక్కి రాగానే కథ సుఖాంతం అయిపోయింది. కానీ ఈ కథ సుఖాంతం కాదు. డిసెంబరు 1న థియేటర్లకు రండి. ఈ సినిమా చూసినపుడు కలిగే అనుభూతి ఇంతకుముందు ఎప్పుడూ కలిగి ఉండదు. ఆ మేరకు హామీ ఇవ్వగలను.
నిజానికి ఈ కథను ఎవరైనా కూడా.ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. లాజిక్కులు లేవా? డ్రామా ఏంటి ఇలా ఉందని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. కానీ రణబీర్ నన్ను నమ్మాడు. నాతో ట్రావెల్ అయ్యాడు. ఈ రోజే యానిమల్ కలర్ గ్రేడింగ్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. అలాగే సినిమాలో ఆరంభం మిస్ కావద్దు. ముగింపు కూడా మిస్ అవ్వొద్దు. ఇదేదో మొత్తం చూడాలని చెప్పట్లేదు. నేనొక గొప్ప తండ్రీ కొడుకుల కథను తీశాననుకుంటున్నా. సినిమా మీద నేనెంతో నమ్మకంతో ఉన్నా. మీరు కూడా అది చూసి ఎంజాయ్ చేస్తారు. డిసెంబరు 1న కలుద్దాం” అని సందీప్ ముగించాడు.
This post was last modified on November 28, 2023 6:22 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…