యానిమల్ కథను విన్న ఎవ్వరైనా ఈజీగా రిజెక్ట్ చేస్తారని.. కానీ రణబీర్ కపూర్ మాత్రం తనను నమ్మి ఈ సినిమా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నాడు. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సందీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా రన్ టైం గురించి ఆందోళన అక్కర్లేదని అతనన్నాడు. యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సందీప్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పర్టికులర్గా మాట్లాడాడు.
”లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. ప్రతి ఫ్రేమ్నూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రణబీర్ కపూర్తో పాటు అనిల్ సార్, బాబీ డియోల్ సాగర్, రష్మిక లాంటి గొప్ప నటులు సినిమాలో ఉన్నారు. అర్జున్ రెడ్డిలో అమ్మాయి వెనక్కి రాగానే కథ సుఖాంతం అయిపోయింది. కానీ ఈ కథ సుఖాంతం కాదు. డిసెంబరు 1న థియేటర్లకు రండి. ఈ సినిమా చూసినపుడు కలిగే అనుభూతి ఇంతకుముందు ఎప్పుడూ కలిగి ఉండదు. ఆ మేరకు హామీ ఇవ్వగలను.
నిజానికి ఈ కథను ఎవరైనా కూడా.ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. లాజిక్కులు లేవా? డ్రామా ఏంటి ఇలా ఉందని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. కానీ రణబీర్ నన్ను నమ్మాడు. నాతో ట్రావెల్ అయ్యాడు. ఈ రోజే యానిమల్ కలర్ గ్రేడింగ్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. అలాగే సినిమాలో ఆరంభం మిస్ కావద్దు. ముగింపు కూడా మిస్ అవ్వొద్దు. ఇదేదో మొత్తం చూడాలని చెప్పట్లేదు. నేనొక గొప్ప తండ్రీ కొడుకుల కథను తీశాననుకుంటున్నా. సినిమా మీద నేనెంతో నమ్మకంతో ఉన్నా. మీరు కూడా అది చూసి ఎంజాయ్ చేస్తారు. డిసెంబరు 1న కలుద్దాం” అని సందీప్ ముగించాడు.
This post was last modified on November 28, 2023 6:22 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…