ప్రస్తుతం ఇండస్ట్రీలో రివ్యూల మీద ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఇటీవలే కోట బొమ్మాళి పీఎస్ ప్రెస్ మీట్ లో దీని గురించి ఓ రేంజ్ లో రాద్ధాంతం జరిగినంత పనైంది. ఆదికేశవ ఈవెంట్ లోనూ డిస్కషన్ నడిచింది. రేటింగ్స్, రివ్యూలు వీడుదల రోజే రావడం వల్ల రెవిన్యూల మీద ప్రభావం పడుతోందని వాటిని ఆలస్యం చేయాలని ఒకరు, వాడుతున్న భాష సరిగా లేదని వేరొకరు ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ కు ఖచ్చితంగా వస్తారని తెలిసి కూడా వాదోపవాదాలు జరగడం పట్ల సోషల్ మీడియాలోనూ రియాక్షన్స్ కనిపించాయి.
తాజాగా నితిన్ రివ్యూల పట్ల తన మనోగతాన్ని ఓపెన్ గా పంచుకున్నాడు. మా సైట్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రివ్యూలు రావడం వల్ల చాలా మంది దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారని, లేదంటే లాజిక్స్ ని గాలికి వదిలేసి, ఎవరు అడుగుతారనే ధీమాలో ఉండేవారని అన్నాడు. ఫలానా సీన్ లో నటిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న లోపం రేపు ఏ రివ్యూయర్ అయినా పసిగడతారనే టెన్షన్ ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. హిట్ అయినప్పుడు పోస్టర్లలో రేటింగ్స్ వేసుకున్నప్పుడు ఫ్లాప్ అయితే మూసుకుని ఉండాలనేది నితిన్ లాజిక్.
ఇంత బహిర్గతంగా రివ్యూలను సమర్ధించిన హీరో నితినేనని చెప్పొచ్చు. డిసెంబర్ 8 విడుదల కాబోతున్న ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్ల కోసం నితిన్ యాక్టివ్ అయ్యాడు. వరస ఇంటర్వ్యూలతో పాటు ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్రాలు ప్లాన్ చేసుకున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ వినోదమే ప్రధానంగా నడుస్తుంది తప్ప అవసరం లేని మాస్ ని ఇరికించే ప్రయత్నం చేయలేదని చెప్పాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కు ఒక రోజు ముందు నాని హాయ్ నాన్న పోటీ ఇస్తోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ తప్పుకున్నాయి.
This post was last modified on November 27, 2023 1:16 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…