ఒక రీజనల్ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడం చాలా అరుదు. అందులోనూ బడ్జెట్ తక్కువగా పెట్టిన చిత్రాలకు. కానీ కాంతార ఈ ట్రెండ్ ని నిలువునా బ్రేక్ చేసింది. కన్నడలో ముందు రిలీజై రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో వచ్చినా కూడా ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోని బ్లాక్ బస్టర్ సాధించడం విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం 16 కోట్లతో తీస్తే వందల కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 రాబోతోంది. ఈ సందర్భంగా హోంబాలే ఫిలిమ్స్ అనౌన్స్ మెంట్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు.
మొత్తం ఏడు భాషల్లో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రాబోతోంది. కాన్సెప్ట్ ఎక్కువ రివీల్ చేయలేదు కానీ వెలుగు చూపించని రహస్యాలు ఎన్నో చీకట్లో బయట పడతాయని, వాటిని చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పే సందేశం వినిపించారు. కదంబాలు రావడానికి ముందు జరిగిన కథను ఇందులో ఆవిష్కరించబోతున్నారు. రిషబ్ శెట్టి కాల రుద్రుడిగా ఉగ్ర రూపంలో కనిపించడం భీతి గొలిపేలా ఉంది. చేతిలో త్రిశూలం, కళ్ళలో రౌద్రం నిండి, కోపంగా చూస్తున్న ఎక్స్ ప్రెషన్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. స్టోరీకి సంబంధించి ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు.
విరూపాక్ష, మంగళవారంలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన అజనీష్ లోకనాథ్ మరోసారి కాంతారకు లైఫ్ ఇచ్చే బిజిఎంతో ఆకట్టుకోబోతున్నాడు. రెండు మూడు విజువల్స్ మాత్రమే చూపించినా డెప్త్ కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్ భారీగా కేటాయించబోతున్నారు. రెండు వందల కోట్ల దాకా ఉండొచ్చని బెంగళూరు టాక్. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే దానికి పదింతలు షాకింగ్ కంటెంట్ తో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. తెలుగు, హిందీ, కన్నడ, తమిళంతో కలిపి మొత్తం ఏడు భాషల్లో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రానుంది. విడుదల తేదీని ప్రకటించలేదు. 2024 చివరిలో ఉండొచ్చు.
This post was last modified on November 27, 2023 12:55 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…