ఒక రీజనల్ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడం చాలా అరుదు. అందులోనూ బడ్జెట్ తక్కువగా పెట్టిన చిత్రాలకు. కానీ కాంతార ఈ ట్రెండ్ ని నిలువునా బ్రేక్ చేసింది. కన్నడలో ముందు రిలీజై రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో వచ్చినా కూడా ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోని బ్లాక్ బస్టర్ సాధించడం విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం 16 కోట్లతో తీస్తే వందల కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 రాబోతోంది. ఈ సందర్భంగా హోంబాలే ఫిలిమ్స్ అనౌన్స్ మెంట్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు.
మొత్తం ఏడు భాషల్లో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రాబోతోంది. కాన్సెప్ట్ ఎక్కువ రివీల్ చేయలేదు కానీ వెలుగు చూపించని రహస్యాలు ఎన్నో చీకట్లో బయట పడతాయని, వాటిని చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పే సందేశం వినిపించారు. కదంబాలు రావడానికి ముందు జరిగిన కథను ఇందులో ఆవిష్కరించబోతున్నారు. రిషబ్ శెట్టి కాల రుద్రుడిగా ఉగ్ర రూపంలో కనిపించడం భీతి గొలిపేలా ఉంది. చేతిలో త్రిశూలం, కళ్ళలో రౌద్రం నిండి, కోపంగా చూస్తున్న ఎక్స్ ప్రెషన్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. స్టోరీకి సంబంధించి ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు.
విరూపాక్ష, మంగళవారంలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన అజనీష్ లోకనాథ్ మరోసారి కాంతారకు లైఫ్ ఇచ్చే బిజిఎంతో ఆకట్టుకోబోతున్నాడు. రెండు మూడు విజువల్స్ మాత్రమే చూపించినా డెప్త్ కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్ భారీగా కేటాయించబోతున్నారు. రెండు వందల కోట్ల దాకా ఉండొచ్చని బెంగళూరు టాక్. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే దానికి పదింతలు షాకింగ్ కంటెంట్ తో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. తెలుగు, హిందీ, కన్నడ, తమిళంతో కలిపి మొత్తం ఏడు భాషల్లో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రానుంది. విడుదల తేదీని ప్రకటించలేదు. 2024 చివరిలో ఉండొచ్చు.
This post was last modified on November 27, 2023 12:55 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…