సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దర్శకుడు. ఇప్పటిదాకా థియేటర్లలోకి వచ్చిన అతడి సినిమాల సంఖ్య రెండే. అది కూడా ఒక కథనే రెండు భాషల్లో తీశాడు. కానీ అతను యూత్లో తెచ్చుకున్న క్రేజ్ మాత్రం అలాంటిలాంటిది కాదు.
తెలుగులో అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసి.. హిందీలో అదే కథతో తీసిన కబీర్సింగ్తో అక్కడా సంచలనం రేపి.. ఇప్పుడు యానిమల్తో మరింతగా ప్రకంపనలు రేపేలా కనిపిస్తున్నాడు సందీప్. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత హైప్ తెచ్చుకున్న దర్శకుడు ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో.
యానిమల్ సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా.. కేవలం టీజర్, ట్రైలర్లతోనే అతను ప్రకంపనలు రేపాడు. ఈ శుక్రవారం భారీ అంచనాలతో విడుదల కానున్న యానిమల్ బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా భారీ విజయం అందుకుంటుందన్న అంచనాలున్నాయి.
ఓవైపు యానిమల్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమయంలోనే.. సందీప్ రెడ్డికి సంబంధించిన వేరే వీడియోలు తెగ తిరిగేస్తున్నాయి. అందులో ఒకటి అతను నటుడిగా కనిపించిన వీడియో కావడం విశేషం. సందీప్ దర్శకుడు కావడానికి ముందు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు.
అతను అసిస్టెంట్గా చేసిన ఏకైక చిత్రం ఇదే. కిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఐతే ఈ చిత్రంలో ఒక చిన్న సీన్లో సందీప్ నటుడిగా కనిపించాడు. నావీ పోలీసులు స్మగ్లర్లున్న బోట్ మీద దాడి చేస్తే ఆ బోట్లో సందీప్ కూడా ఉంటాడు.
ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తప్ప అందులో ఉన్నది సందీప్ అనే విషయం పసిగట్టలేం. సందీప్ నటుడు కూడానా అంటూ ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on November 27, 2023 7:38 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…