సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దర్శకుడు. ఇప్పటిదాకా థియేటర్లలోకి వచ్చిన అతడి సినిమాల సంఖ్య రెండే. అది కూడా ఒక కథనే రెండు భాషల్లో తీశాడు. కానీ అతను యూత్లో తెచ్చుకున్న క్రేజ్ మాత్రం అలాంటిలాంటిది కాదు.
తెలుగులో అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసి.. హిందీలో అదే కథతో తీసిన కబీర్సింగ్తో అక్కడా సంచలనం రేపి.. ఇప్పుడు యానిమల్తో మరింతగా ప్రకంపనలు రేపేలా కనిపిస్తున్నాడు సందీప్. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత హైప్ తెచ్చుకున్న దర్శకుడు ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో.
యానిమల్ సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా.. కేవలం టీజర్, ట్రైలర్లతోనే అతను ప్రకంపనలు రేపాడు. ఈ శుక్రవారం భారీ అంచనాలతో విడుదల కానున్న యానిమల్ బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా భారీ విజయం అందుకుంటుందన్న అంచనాలున్నాయి.
ఓవైపు యానిమల్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమయంలోనే.. సందీప్ రెడ్డికి సంబంధించిన వేరే వీడియోలు తెగ తిరిగేస్తున్నాయి. అందులో ఒకటి అతను నటుడిగా కనిపించిన వీడియో కావడం విశేషం. సందీప్ దర్శకుడు కావడానికి ముందు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు.
అతను అసిస్టెంట్గా చేసిన ఏకైక చిత్రం ఇదే. కిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఐతే ఈ చిత్రంలో ఒక చిన్న సీన్లో సందీప్ నటుడిగా కనిపించాడు. నావీ పోలీసులు స్మగ్లర్లున్న బోట్ మీద దాడి చేస్తే ఆ బోట్లో సందీప్ కూడా ఉంటాడు.
ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తప్ప అందులో ఉన్నది సందీప్ అనే విషయం పసిగట్టలేం. సందీప్ నటుడు కూడానా అంటూ ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on November 27, 2023 7:38 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…