‘యానిమల్’ సినిమా తీసింది తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగనే కావచ్చు. కానీ అందులో హీరో సహా పలువురు కీలక పాత్రధారులు బాలీవుడ్కు చెందిన వారే. ఈ సినిమాను నిర్మించింది బాలీవుడ్ నిర్మాణ సంస్థ. కథ నేపథ్యం సహా అన్నీ ఉత్తరాది టచ్తోనే ఉన్నాయి.
ప్రాథమికంగా ఇది హిందీ సినిమా అనడంలో సందేహం లేదు. గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ సహా పలువురు తెలుగు దర్శకులు హిందీలో అక్కడి హీరోలతో సినిమాలు తీశారు. కానీ వాటికి వేటికీ రాని క్రేజ్ ‘యానిమల్’కు తెలుగులో కనిపిస్తోంది. ఈ సినిమా ప్రోమోలు మన ప్రేక్షకులకు పిచ్చెక్కించేశాయి.
ఒక తెలుగు స్టార్ హీరో నటించిన స్ట్రెయిట్ మూవీ స్థాయిలో దీని కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల క్యూరియాసిటీ ఏ స్థాయిలో ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమైపోతోంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ క్రేజ్ను బాగానే అర్థం చేసుకున్నట్లున్నారు.
‘యానిమల్’కు హైదరాబాద్లో ఉదయం 7.00 గంటల నుంచే షోలు మొదలైపోతుండటం విశేషం. ఆ షోలకు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఏఎంబీ సినిమాస్లో అయితే నాలుగు షోలకు టికెట్లు పడితే కొన్ని గంటల్లో అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఇంకా పలు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు 7 గంటల షోలు కనీసం 50 అయినా పడేలా ఉన్నాయి.
అవన్నీ ఫుల్స్ పడితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హైదరాబాద్ అనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్లో పొద్దు పొద్దునే షోలు ప్యాక్డ్ హౌస్లతో నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. బహుశా ఏ హిందీ సినిమాకూ తెలుగులో ఇలాంటి క్రేజ్ చూసి ఉండకపోవచ్చు. ఇదంతా సందీప్ రెడ్డి ఘనతే అనడంలో సందేహం లేదు. దీనికే ఇలా ఉంటే.. ప్రభాస్తో అతను తీసే ‘స్పిరిట్’కు హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.
This post was last modified on November 26, 2023 8:49 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…