పేరుకి తమిళ హీరోలే అయినా తెలుగు ఆడియెన్సు లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సూర్య, తమ్ముడు కార్తీల మీద ఒక డైరెక్టర్ వల్ల వివాదాస్పద చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల ప్రారంభంలో జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కార్తీతో పని చేసిన పాతిక దర్శకులను ఆ వేడుకకు ఆహ్వానించారు. అయితే మొదటి చిత్రం పరుత్తివీరన్(మల్లిగాడు) తీసిన అమీర్ కు పిలుపు వెళ్ళలేదు. దీనికి కారణం ఏంటని నిర్మాత జ్ఞానవేల్ రాజాని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దీనికాయన సమాధానమిస్తూ అమీర్ బడ్జెట్ ని ఎక్కువ చూపించి డబ్బులు దుర్వినియోగం చేశాడని చెప్పుకొచ్చాడు.
దీంతో అమీర్ తీవ్రంగా స్పందించారు. షూటింగ్ సగం కాకుండానే జ్ఞానవేల్ రాజా మాయమైపోతే తాను స్నేహితులందరి దగ్గర అప్పు చేసి పూర్తి చేశానని, ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా తన మీద ఆరోపణలు చేయడం దారుణమని వివరణ ఇచ్చాడు. అమీర్ కు మద్దతగా నటుడు సముతిరఖని సుదీర్ఘంగా ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఆరునెలలు పరుత్తి వీరన్ సెట్స్ లో ఉన్నానని, ఏనాడూ జ్ఞానవేల్ రాజాని చూడలేదని చెప్పడం కాంట్రావర్సిని కొత్త మలుపు తిప్పింది. మరో హీరో, దర్శకుడు శశికుమార్ సైతం బడ్జెట్ లో చేయి వేసి ఆదుకున్నాడని గుర్తు చేశాడు.
సాంకేతికంగా పరుత్తివీరన్ కు జ్ఞానవేలే నిర్మాత. అమీర్ డబ్బులు పెట్టినా కూడా హక్కులు ఆయనవి కాదు. అయితే సినిమా ఊహించిన దానికన్నా గొప్ప విజయం సాధించడం, జాతీయ అవార్డు రేంజ్ కి చేరుకోవడంతో ఒక్కసారిగా కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. కార్తీలో అంత గొప్ప పెర్ఫార్మర్ ఉన్నాడని ప్రపంచానికి చెప్పింది అమీరే. జ్ఞానవేల్ రాజా, అమీర్ లకు మధ్య ఇంత గొడవ జరుగుతుంటే కార్తీ, సూర్యలు మాత్రం ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. పరుత్తివీరన్ తెలుగులో మల్లిగాడుగా డబ్ చేసి థియేటర్ రిలీజ్ చేశారు కానీ ఇక్కడ ఆడలేదు. తర్వాత శాటిలైట్, ఓటిటి ఎక్కడా అందుబాటులో లేదు.
This post was last modified on November 26, 2023 8:19 pm
"ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం…
అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో…
వైసీపీ అధినేత జగన్.. లండన్ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు…
హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్…