విడుదలకు ఇంకో అయిదు రోజులు ఉండగానే అనిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ మెట్రో స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం పివిఆర్ ఐనాక్స్, సినీపోలీస్ నుంచే ఇరవై నాలుగు గంటల్లో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. వీటిలో మిరాజ్, మూవీ మ్యాక్స్, ప్రసాద్స్ లాంటివి కలపలేదు. మొదటి రోజే చూసి తీరాలన్న బలమైన కోరికతో మూవీ లవర్స్ ఆలస్యం చేయడం లేదు. నవంబర్ 30 రాత్రి స్పెషల్ ప్రీమియర్లు ఉంటాయనే అనుమానమున్న ఫ్యాన్స్ ఇంకా వేచి చూస్తున్నారు కానీ ఆ సంగతి తేలాక అమ్మకాలు మరింత ఊపందుకుంటాయి. ఇదంతా బహదూర్ ని టెన్షన్ పెడుతోంది.
అదే రోజు విడుదలవుతోన్న విక్కీ కౌశల్ సామ్ బహద్దూర్ కి ఇప్పుడీ అనిమల్ వల్ల హైప్ సమస్య వచ్చింది. ఒక భారత వీర సైనికుడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. ప్రస్తుతానికి రెండు వేల దగ్గరలో ఉండగా అనూహ్యమైన మార్పు ఏమీ ఉండకపోవచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. అనిమల్ కు వచ్చే టాక్, దానికి టికెట్లు దొరక్క మిగిలే ఓవర్ ఫ్లోస్ మీదే సామ్ బహద్దూర్ ఓపెనింగ్ ఫిగర్స్ ఆధారపడి ఉంటాయని తేల్చి చెబుతున్నారు. మంచి కంటెంట్ అయినప్పటికీ విక్కీ కౌశల్ ఇమేజ్ ఆడియన్స్ ని ఫుల్ చేయలేకపోతోంది.
మొదటి ఆటకు అనిమల్ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సామ్ బహద్దూర్ కు కష్టాలు తప్పవు. ఎందుకంటే నార్త్ లో ఒక్కసారి బాగుందనే మాట వినిపిస్తే ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో అర్ధరాత్రి నుంచే స్పెషల్ షోలు వేస్తారు. ఈ ట్రెండ్ ఆది, సోమవారాలు దాకా కొనసాగుతుంది. ఆ వేవ్ ని సామ్ బహదూర్ తట్టుకోవడం కష్టం. నిజానికి అనిమల్ కి ఇంత మేనియాని ఎవరూ ఊహించలేదు. ప్రీ రిలీజ్ బజ్ ఉంటుందనుకున్నారు కానీ కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగా ఈ స్థాయిలో అంచనాలు పెంచేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు సిద్దపడటం తప్ప బహదూర్ చేతిలో ఏమి లేదు.
This post was last modified on November 26, 2023 3:38 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…