ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న వాటిలో స్పిరిట్ ఒకటి. అర్జున్ రెడ్డితో సంచలనం రేపి.. యానిమల్తో మరింత సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్న సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందటే అనౌన్స్ అయిన ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు.
ప్రభాస్, సందీప్ ఎవరికి వాళ్లు బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు యానిమల్ మూవీ ఈ డిసెంబరు 1న రిలీజైపోతుండటంతో సందీప్ ఫ్రీ అయిపోతున్నాడు. మరి స్పిరిట్ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టే విషయమై అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ప్రభాస్తో తాను చేయబోయే స్పిరిట్ సినిమాకు వచ్చే జూన్ నుండి ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందని సందీప్ చెప్పాడు. ఈ సినిమాకు కథ రెడీ అయిందని.. ఈ గ్యాప్ లో ట్రీట్మెంట్, డైలాగ్స్ మీద వర్క్ చేయాల్సి ఉందని చెప్పాడు సందీప్. ఇక అల్లు అర్జున్, మహేష్ బాబులతో సినిమాల సంగతి ఏమైందని అడిగితే.. మహేష్ బాబుకు ఓ కథ చెప్పానని.. అది ఆయనకి నచ్చిందని.. అయితే వేరే కమిట్మెంట్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేదని సందీప్ తెలిపాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని తనకుందని సందీప్ చెప్పాడు.
ఇక యానిమల్ సినిమా రన్ టైం మరీ 3 గంటల 21 నిమిషాలు ఉండటంపై పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది సమస్య కాదా అని సందీప్ను అడిగితే.. అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాల సినిమా. అది ఒక అమ్మాయి-అబ్బాయి కథే. యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా లేయర్స్ వున్నాయి. అర్జున్ రెడ్డి కంటే పదిహేను నిముషాలకే ఎక్కువ. ఇంకొ పది నిముషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది అని సందీప్ చెప్పాడు.
This post was last modified on November 26, 2023 7:33 am
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…