ఇప్పుడు టాలీవుడ్లో ‘బి ది రియల్ మ్యాన్’ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి మొదలెట్టిన ఈ ఛాలెంట్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మీదుగా ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్… ఇలా స్టార్లలందరినీ తాకింది. ఇంట్లో అన్ని రకాల పనులు చేస్తూ స్టార్ హీరోలు వీడియోలు పెడుతూ, తమ అభిమానులను అలరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ మరి మిగిలిన హీరోల సంగతేంటి?
టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలు ఇలాంటి ఛాలెంజ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. ఇంట్లో పనులన్నీ చేస్తూ… వీడియోలు షూట్ చేసుకుని… ఎవరు ఛాలెంజ్ చేస్తారా? ఎప్పుడు వీడియోను వదులుదామా? అని వెయిట్ చేస్తున్నారని టాక్.
ఎవ్వరూ ఛాలెంజ్ చేయకుండా వీడియో రిలీజ్ చేస్తే, ఫ్యాన్స్ ముందు చులకన అయిపోతామని… అందుకే ఏ స్టార్ హీరో అయినా తమ పేరు పలకబోతాడా? అని వీడియోలు రెఢీగా పెట్టుకుని, అప్లోడ్ చేయడానికి సరైన సమయం చూస్తున్నారట.
చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు ఎవ్వరైనా… ‘తెలుగు యంగ్ హీరోలందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి, వీడియోలు పెట్టాలి’ అని ఛాలెంజ్ వేయకపోరా… ఆ వెంటనే వీడియోను రిలీజ్ చేసేద్దామని ప్లాన్తో ఉన్నారట.
అయితే మరికొందరు యంగ్ హీరోలు మాత్రం ఈ ఛాలెంజ్తో సంబంధం లేకుండా తమకోసం ఓ కొత్త ఛాలెంజ్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారట. ఇప్పటికే హీరోయిన్ పాయల్ రాజ్పుత్ వెరైటీ వేషాలతో ఛాలెంజ్ చేస్తున్నట్టు, ఏదైనా క్రియేటివ్ ఛాలెంజ్తో వీడియో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. లాక్డౌన్ కారణంగా యంగ్ హీరోల క్రియేటివిటీకి బాగానే పని పడినట్టుంది.
This post was last modified on April 26, 2020 9:36 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…