ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యాక దానికి కొనసాగింపైనా సరే అందులోనే చూడాలనే నమ్మకాన్ని నిలువునా బ్రేక్ చేసి విజయం సాధించిన సినిమా మా ఊరి పొలిమేర 2. కంటెంట్ లో హెచ్చుతగ్గులు, క్యాస్టింగ్ లో స్టార్లు లేకపోవడం, బడ్జెట్ పరిమితులు ఇలా అన్ని అడ్డంకులు దాటుకుని ఇరవై కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బిసి సెంటర్ల వసూళ్లు బయ్యర్లు ఊహించలేదు. దెబ్బకు నిర్మాతలు ఇప్పుడు మూడో భాగాన్ని రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని డిసైడయ్యారు. ఆ మేరకు ప్లానింగ్ కూడా జరిగి ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు.
ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొన్ని చిత్రాలు ఇదే బాట పట్టనున్నాయి. గత ఏడాది ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన భామా కలాపం ఆహా ప్లాట్ ఫార్మ్ మీద మంచి విజయం సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసే ఒక సాధారణ గృహిణి పెద్ద క్రైమ్ లో ఇరుక్కుని క్రిమినల్స్ కే ముచ్చెమటలు పోయించడం అందులో మెయిన్ పాయింట్. దర్శకుడు అభిమన్యు దాన్ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు భామా కలాపం 2ని తీస్తున్నారు. అయితే ఇది మాత్రం థియేటర్లలో వస్తుందని అధికారికంగా ప్రకటించారు.
ఇది ఒకరకంగా మంచి ట్రెండ్. ఓటిటి ఆదాయం మత్తులో పడి ముందు వెనుకా చూసుకోకుండా బడ్జెట్ లు పెంచేస్తున్న నిర్మాతలు ఇకనైనా థియేటర్ మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంటారు. దీని రెవిన్యూని తేలిగ్గా తీసుకుంటే ఎంతటి పరిణామాలు ఎదురవుతాయో గత వారం రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. వీటి వల్ల రెండు మూడు సెట్ల మీదకు వెళ్లాల్సిన మీడియం బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయి కూడా. అందుకే భామా కలాపం ప్రొడ్యూసర్లు తెలివిగా నిర్ణయం మార్చుకున్నారు. ఈసారి దొంగతనం కాన్సెప్ట్ ని కూడా జోడించినట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అదే టీమ్ పని చేయనుంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…