ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యాక దానికి కొనసాగింపైనా సరే అందులోనే చూడాలనే నమ్మకాన్ని నిలువునా బ్రేక్ చేసి విజయం సాధించిన సినిమా మా ఊరి పొలిమేర 2. కంటెంట్ లో హెచ్చుతగ్గులు, క్యాస్టింగ్ లో స్టార్లు లేకపోవడం, బడ్జెట్ పరిమితులు ఇలా అన్ని అడ్డంకులు దాటుకుని ఇరవై కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బిసి సెంటర్ల వసూళ్లు బయ్యర్లు ఊహించలేదు. దెబ్బకు నిర్మాతలు ఇప్పుడు మూడో భాగాన్ని రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని డిసైడయ్యారు. ఆ మేరకు ప్లానింగ్ కూడా జరిగి ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు.
ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొన్ని చిత్రాలు ఇదే బాట పట్టనున్నాయి. గత ఏడాది ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన భామా కలాపం ఆహా ప్లాట్ ఫార్మ్ మీద మంచి విజయం సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసే ఒక సాధారణ గృహిణి పెద్ద క్రైమ్ లో ఇరుక్కుని క్రిమినల్స్ కే ముచ్చెమటలు పోయించడం అందులో మెయిన్ పాయింట్. దర్శకుడు అభిమన్యు దాన్ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు భామా కలాపం 2ని తీస్తున్నారు. అయితే ఇది మాత్రం థియేటర్లలో వస్తుందని అధికారికంగా ప్రకటించారు.
ఇది ఒకరకంగా మంచి ట్రెండ్. ఓటిటి ఆదాయం మత్తులో పడి ముందు వెనుకా చూసుకోకుండా బడ్జెట్ లు పెంచేస్తున్న నిర్మాతలు ఇకనైనా థియేటర్ మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంటారు. దీని రెవిన్యూని తేలిగ్గా తీసుకుంటే ఎంతటి పరిణామాలు ఎదురవుతాయో గత వారం రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. వీటి వల్ల రెండు మూడు సెట్ల మీదకు వెళ్లాల్సిన మీడియం బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయి కూడా. అందుకే భామా కలాపం ప్రొడ్యూసర్లు తెలివిగా నిర్ణయం మార్చుకున్నారు. ఈసారి దొంగతనం కాన్సెప్ట్ ని కూడా జోడించినట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అదే టీమ్ పని చేయనుంది.
This post was last modified on November 23, 2023 12:05 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…