ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యాక దానికి కొనసాగింపైనా సరే అందులోనే చూడాలనే నమ్మకాన్ని నిలువునా బ్రేక్ చేసి విజయం సాధించిన సినిమా మా ఊరి పొలిమేర 2. కంటెంట్ లో హెచ్చుతగ్గులు, క్యాస్టింగ్ లో స్టార్లు లేకపోవడం, బడ్జెట్ పరిమితులు ఇలా అన్ని అడ్డంకులు దాటుకుని ఇరవై కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బిసి సెంటర్ల వసూళ్లు బయ్యర్లు ఊహించలేదు. దెబ్బకు నిర్మాతలు ఇప్పుడు మూడో భాగాన్ని రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని డిసైడయ్యారు. ఆ మేరకు ప్లానింగ్ కూడా జరిగి ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు.
ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొన్ని చిత్రాలు ఇదే బాట పట్టనున్నాయి. గత ఏడాది ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన భామా కలాపం ఆహా ప్లాట్ ఫార్మ్ మీద మంచి విజయం సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసే ఒక సాధారణ గృహిణి పెద్ద క్రైమ్ లో ఇరుక్కుని క్రిమినల్స్ కే ముచ్చెమటలు పోయించడం అందులో మెయిన్ పాయింట్. దర్శకుడు అభిమన్యు దాన్ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు భామా కలాపం 2ని తీస్తున్నారు. అయితే ఇది మాత్రం థియేటర్లలో వస్తుందని అధికారికంగా ప్రకటించారు.
ఇది ఒకరకంగా మంచి ట్రెండ్. ఓటిటి ఆదాయం మత్తులో పడి ముందు వెనుకా చూసుకోకుండా బడ్జెట్ లు పెంచేస్తున్న నిర్మాతలు ఇకనైనా థియేటర్ మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంటారు. దీని రెవిన్యూని తేలిగ్గా తీసుకుంటే ఎంతటి పరిణామాలు ఎదురవుతాయో గత వారం రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. వీటి వల్ల రెండు మూడు సెట్ల మీదకు వెళ్లాల్సిన మీడియం బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయి కూడా. అందుకే భామా కలాపం ప్రొడ్యూసర్లు తెలివిగా నిర్ణయం మార్చుకున్నారు. ఈసారి దొంగతనం కాన్సెప్ట్ ని కూడా జోడించినట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అదే టీమ్ పని చేయనుంది.
This post was last modified on November 23, 2023 12:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…