స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లు చేయడం హిందీలో సహజమే కానీ తెలుగులో ఈ ట్రెండ్ మొదలుపెడుతోంది మాత్రం నాగ చైతన్యనే. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో రూపొందించిన దూత డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో క్రైమ్ కం సెమి హారర్ జానర్ లో రూపొందిన దూతకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడం అంచనాలు పెంచుతోంది. చైతు ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలు ప్రోగ్రాంలు చేస్తున్నాడు. దూతను వీలైనంత ఎక్కువగా ఆడియన్స్ కి చేర్చాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సమాచార్ దినపత్రికలో పని చేసే సాగర్(నాగ చైతన్య) జర్నలిస్టు అంటే సమాజానికి ఒక బాధ్యతతో ఉండాల్సిన దూతగా భావిస్తుంటాడు. అయితే పలు న్యూస్ పేపర్లలో వచ్చే కటింగ్స్, కార్టూన్స్ ఆధారంగా కొన్ని హత్యలు జరుగుతున్నాయని తెలిసి షాక్ తింటాడు. స్వంత కుటుంబాన్నే రిస్క్ లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సాగర్ భయపడకుండా ఈ మిస్టరీని ఛేదించేందుకు బయలు దేరతాడు. ఒక నేరం తన మీదే పడి పద్మవ్యూహంలో చిక్కుంటుంటాడు. జనాలకు దూతగా ఉండాల్సిన ఒక విలేఖరి ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయట పడ్డాడో తెలియాలంటే లెన్తీ సిరీస్ కి రెడీ అవ్వాలి.
క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దూత రూపొందిన విషయాన్ని వీడియోలో చెప్పేశారు. చైతుకి ఇలాంటి పాత్ర చేయడం కొత్త. డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ప్రచి దేశాయ్, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఒక చీకటి నేర ప్రపంచంలో విక్రమ్ కె కుమార్ తీసుకెళ్లబోతున్నాడు. కంటెంట్ షాకింగ్ గా ఉండబోతోందనే హింట్ అయితే స్పష్టంగా ఇచ్చారు. దూత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే దాన్ని బట్టి మిగిలిన హీరోలో ఈ రూటు పట్టే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం దాకా ఆగాలి మరి.
This post was last modified on November 23, 2023 10:35 am
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…