ఈ క్రిస్మస్కు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది డంకీ. ఇప్పటికే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి బ్లాక్బస్టర్లతో మాంచి ఊపుమీదున్నాడు. అలాంటి హీరో ఇప్పటిదాకా అన్నీ బ్లాక్బస్టర్లే తీసిన రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతుండటంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.
సలార్ లాంటి భారీ చిత్రంతో పోటీకి సై అన్నారంటే ఈ చిత్రం మీద మేకర్స్కు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ గురించి ఇప్పుడు బయటికి వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాంబినేషన్ చూసి వందల కోట్లు పెట్టి ఉంటారని అనుకుంటాం కానీ.. డంకీ బడ్జెట్ కేవలం రూ.80 కోట్లు మాత్రమేనట.
డంకీ సినిమాను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్తో కలిసి రాజ్ కుమార్ హిరానియే నిర్మించాడు. ఇటు షారుఖ్, అటు హిరాని ఇద్దరూ కూడా ఈ సినిమాకు పారితోషకాలు తీసుకోకుండా.. లాభాల్లో వాటాను పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కేవలం ప్రొడక్షన్ మీదే పెట్టుబడి అంతా పెట్టారు. ఆ ఖర్చు రూ.80 కోట్లు మాత్రమేనట. ఇందులోనే మిగతా పారితోషకాలు కూడా ఉన్నాయి.
హీరో, డైరెక్టర్ పారితోషకాలు తీసేసినా కూడా.. రూ.80 కోట్లంటే తక్కువ బడ్జెట్ అన్నట్లే. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్కి రూ.500 కోట్లకు తక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చినా రావచ్చు. లాభాలే ఐదొందల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని బట్టి షారుఖ్, హిరాని ఏ స్థాయిలో లాభ పడతారో అంచనా వేయొచ్చు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న డంకీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 23, 2023 6:28 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…