ఈ క్రిస్మస్కు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది డంకీ. ఇప్పటికే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి బ్లాక్బస్టర్లతో మాంచి ఊపుమీదున్నాడు. అలాంటి హీరో ఇప్పటిదాకా అన్నీ బ్లాక్బస్టర్లే తీసిన రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతుండటంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.
సలార్ లాంటి భారీ చిత్రంతో పోటీకి సై అన్నారంటే ఈ చిత్రం మీద మేకర్స్కు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ గురించి ఇప్పుడు బయటికి వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాంబినేషన్ చూసి వందల కోట్లు పెట్టి ఉంటారని అనుకుంటాం కానీ.. డంకీ బడ్జెట్ కేవలం రూ.80 కోట్లు మాత్రమేనట.
డంకీ సినిమాను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్తో కలిసి రాజ్ కుమార్ హిరానియే నిర్మించాడు. ఇటు షారుఖ్, అటు హిరాని ఇద్దరూ కూడా ఈ సినిమాకు పారితోషకాలు తీసుకోకుండా.. లాభాల్లో వాటాను పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కేవలం ప్రొడక్షన్ మీదే పెట్టుబడి అంతా పెట్టారు. ఆ ఖర్చు రూ.80 కోట్లు మాత్రమేనట. ఇందులోనే మిగతా పారితోషకాలు కూడా ఉన్నాయి.
హీరో, డైరెక్టర్ పారితోషకాలు తీసేసినా కూడా.. రూ.80 కోట్లంటే తక్కువ బడ్జెట్ అన్నట్లే. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్కి రూ.500 కోట్లకు తక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చినా రావచ్చు. లాభాలే ఐదొందల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని బట్టి షారుఖ్, హిరాని ఏ స్థాయిలో లాభ పడతారో అంచనా వేయొచ్చు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న డంకీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…