ఈ క్రిస్మస్కు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది డంకీ. ఇప్పటికే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి బ్లాక్బస్టర్లతో మాంచి ఊపుమీదున్నాడు. అలాంటి హీరో ఇప్పటిదాకా అన్నీ బ్లాక్బస్టర్లే తీసిన రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతుండటంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.
సలార్ లాంటి భారీ చిత్రంతో పోటీకి సై అన్నారంటే ఈ చిత్రం మీద మేకర్స్కు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ గురించి ఇప్పుడు బయటికి వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాంబినేషన్ చూసి వందల కోట్లు పెట్టి ఉంటారని అనుకుంటాం కానీ.. డంకీ బడ్జెట్ కేవలం రూ.80 కోట్లు మాత్రమేనట.
డంకీ సినిమాను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్తో కలిసి రాజ్ కుమార్ హిరానియే నిర్మించాడు. ఇటు షారుఖ్, అటు హిరాని ఇద్దరూ కూడా ఈ సినిమాకు పారితోషకాలు తీసుకోకుండా.. లాభాల్లో వాటాను పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కేవలం ప్రొడక్షన్ మీదే పెట్టుబడి అంతా పెట్టారు. ఆ ఖర్చు రూ.80 కోట్లు మాత్రమేనట. ఇందులోనే మిగతా పారితోషకాలు కూడా ఉన్నాయి.
హీరో, డైరెక్టర్ పారితోషకాలు తీసేసినా కూడా.. రూ.80 కోట్లంటే తక్కువ బడ్జెట్ అన్నట్లే. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్కి రూ.500 కోట్లకు తక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చినా రావచ్చు. లాభాలే ఐదొందల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని బట్టి షారుఖ్, హిరాని ఏ స్థాయిలో లాభ పడతారో అంచనా వేయొచ్చు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న డంకీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…