సాధారణంగా స్టార్ హీరోల సినిమాల షూటింగులు ఆలస్యమవుతాయి కానీ హఠాత్తుగా బ్రేకులు పడటం అరుదు. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రాన్ని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఇది నాలుగో మూవీ. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత మైత్రి బ్యానర్ నిర్మాణంలో మరోసారి చేతులు కలిపారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా హఠాత్తుగా బ్రేక్ వేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిన్న సాయంత్రం నిర్మాత నవీన్ పుట్టినరోజు జరిగిన గంటల్లోనే ఈ న్యూస్ వచ్చింది.
కారణాలు బడ్జెట్ ఇష్యూస్ గా పేర్కొంటున్నారు కానీ నిజానికి మైత్రిలో డబ్బు సమస్య లేదు. స్క్రిప్ట్ లో ఏదో అసంతృప్తిగా అనిపించడంతో పాటు ప్రొడక్షన్ పరంగా వ్యయాన్ని తగ్గించే అవసరాన్ని గుర్తించి కొంచెం పాజ్ ఇచ్చారట. మొత్తంగా ఆగిపోలేదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఇదే సంస్థలో గోపిచంద్ మలినేని వీరసింహారెడ్డి ఇచ్చాడు. దానికీ వ్యయం కాస్త ఎక్కువే అయ్యిందని వార్తలొచ్చాయి. సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది. మళ్ళీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ రవితేజ వరస బ్లాక్ బస్టర్లలో లేడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వరసగా నిరాశపరిచాయి .
ఈ నేపథ్యంలో ఇంత పెద్ద హీరో రేపు సెట్స్ లో అడుగు పెట్టాల్సిన టైంలో ఇలా జరగడం ఊహించని పరిణామమే. క్రాక్ లాగే నిజ జీవితం సంఘటనలు ఆధారంగా చేసుకున్న మలినేని టీమ్ అయితే సెట్ చేసుకున్నాడు కానీ ఇంకా హీరోయిన్ దొరకలేదు. ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. సో దీన్ని మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారనేది వేచి చూడాలి. ఈగల్ జనవరి 13 విడుదల కాబోతున్న నేపథ్యంలో రవితేజ మెల్లగా దాని ప్రమోషన్లలో భాగమయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడు మలినేనికి ఏదైనా గ్యాప్ ఇచ్చినట్టా లేక డిసెంబర్ కన్నా ఆలస్యంగా మొదలవుతుందా చూడాలి.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…