Movie News

రవితేజ సినిమాకు బ్రేకంటే సంచలనమే

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల షూటింగులు ఆలస్యమవుతాయి కానీ హఠాత్తుగా బ్రేకులు పడటం అరుదు. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రాన్ని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఇది నాలుగో మూవీ. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత మైత్రి బ్యానర్ నిర్మాణంలో మరోసారి చేతులు కలిపారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా హఠాత్తుగా బ్రేక్ వేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిన్న సాయంత్రం నిర్మాత నవీన్ పుట్టినరోజు జరిగిన గంటల్లోనే ఈ న్యూస్ వచ్చింది.

కారణాలు బడ్జెట్ ఇష్యూస్ గా పేర్కొంటున్నారు కానీ నిజానికి మైత్రిలో డబ్బు సమస్య లేదు. స్క్రిప్ట్ లో ఏదో అసంతృప్తిగా అనిపించడంతో పాటు ప్రొడక్షన్ పరంగా వ్యయాన్ని తగ్గించే అవసరాన్ని గుర్తించి కొంచెం పాజ్ ఇచ్చారట. మొత్తంగా ఆగిపోలేదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఇదే సంస్థలో గోపిచంద్ మలినేని వీరసింహారెడ్డి ఇచ్చాడు. దానికీ వ్యయం కాస్త ఎక్కువే అయ్యిందని వార్తలొచ్చాయి. సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది. మళ్ళీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ రవితేజ వరస బ్లాక్ బస్టర్లలో లేడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వరసగా నిరాశపరిచాయి .

ఈ నేపథ్యంలో ఇంత పెద్ద హీరో రేపు సెట్స్ లో అడుగు పెట్టాల్సిన టైంలో ఇలా జరగడం ఊహించని పరిణామమే. క్రాక్ లాగే నిజ జీవితం సంఘటనలు ఆధారంగా చేసుకున్న మలినేని టీమ్ అయితే సెట్ చేసుకున్నాడు కానీ ఇంకా హీరోయిన్ దొరకలేదు. ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. సో దీన్ని మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారనేది వేచి చూడాలి. ఈగల్ జనవరి 13 విడుదల కాబోతున్న నేపథ్యంలో రవితేజ మెల్లగా దాని ప్రమోషన్లలో భాగమయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడు మలినేనికి ఏదైనా గ్యాప్ ఇచ్చినట్టా లేక డిసెంబర్ కన్నా ఆలస్యంగా మొదలవుతుందా చూడాలి.

This post was last modified on November 22, 2023 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

34 minutes ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

1 hour ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

3 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

3 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

3 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

4 hours ago