Movie News

జాగ్రత్త పడబోతున్న రానా నాయుడు 2

విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే మొదటిసారి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విమర్శలు అందుకున్న వెబ్ సిరీస్ రానా నాయుడు ఫీడ్ బ్యాక్ సీరియస్ గానే పని చేసింది. ఇవాళ జరిగిన సైంధవ్ ఆడియో సింగల్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక అభిమాని తెచ్చిన ప్రస్తావనకు వెంకీ స్పందించారు. ఫస్ట్ సీజన్ ని కుర్రాళ్ళు ఎంజాయ్ చేశారని, అయితే పెద్దోళ్ళు ఏంట్రా ఇలా చేశావని అడగటంతో ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తామని, నెట్ ఫ్లిక్స్ నుంచి ఆల్రెడీ కాల్ వచ్చిందని త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామనే సంకేతం ఇచ్చారు. సో కొనసాగింపు గురించి అఫీషియల్ గా చెప్పారు.

దీన్ని బట్టే కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ప్రభావం చూపించినట్టు అర్థమైపోయింది. నిజంగానే రానా నాయుడులో అబ్జెక్షన్ అనిపించే కంటెంట్ చాలా ఉంది. అడల్ట్స్ ఓన్లీ అనే ట్యాగ్ పెట్టారు కానీ ప్రముఖ దిన పత్రిలలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చినప్పుడు పరిమితంగా పెద్దలు మాత్రమే చూడండని పరిమితం చేయడం కష్టం. ఈ సమస్య వల్లే ఏముందో తెలియకుండా కేవలం వెంకటేష్ చేశాడనే నమ్మకంతో మొదలుపెట్టేసి నిమిషాల్లో ఆపేసిన లేడీ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. యూత్ ఎంజాయ్ చేయొచ్చు కానీ వెంకీకున్న ఫాలోయింగ్ కి ఇవి సరిపడవనేది అందరి అభిప్రాయం.

సైంధవ్ విడుదలయ్యాకే వెంకటేష్ ఫ్రీ కాబోతున్నారు. జనవరి 13 దాకా నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసిన నేపథ్యంలో నెల రోజులకు పైగా పూర్తి షెడ్యూల్ దానికే ఇవ్వబోతున్నారు. ఇవాళ వదిలిన సాంగ్ కూడా మంచి మాస్ నెంబర్ కావడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గణేష్ తర్వాత ఆ రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సైంధవ్ లో ఉంటుందని అంచనాలు బలంగా ఉన్నాయి. హిట్ ఫస్ట్ కేసు, సెకండ్ కేస్ లతో వరస బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను తక్కువ టైంలోనే పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టేశాడు. గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్ తదితర సినిమాలతో సైంధవ్ కు గట్టి పోటీ ఉంది. 

Satya

Recent Posts

గాడ్ ఆఫ్ వార్ వచ్చేస్తున్నాడు

త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి…

2 hours ago

2026 అర్ధసంవత్సరం… సరిపోని ఉత్సాహం

2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా…

3 hours ago

ఇంకొంచెం ఆగాలంటున్న రణబాలి ?

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్…

3 hours ago

ప్రేక్షకులకు నచ్చని కాక్ టైల్ రుచి

షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…

3 hours ago

సాహో హీరోయిన్ ‘ఈథ’కు టైటిల్ వివాదం

ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…

4 hours ago

పవన్ అంటే అంత పగ ఎందుకు కవిత గారు?

అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…

4 hours ago