మాములుగా ప్యాన్ ఇండియా అంటే దేశం మొత్తం కలుపుకుని ఓ అయిదారు భాషల్లో రిలీజ్ చేయడమే మనకు తెలుసు. మహా అయితే ఇంకో రెండు మూడు అదనంగా ఉంటాయి. కానీ వరల్డ్ వైడ్ వాడుకలో ఉన్న 38 లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేయడమంటే సాహసమే. సూర్య కంగువ ఈ ఫీట్ కి రెడీ అవుతోంది. ఇటీవలే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదొక్కటే కాదు ఐమ్యాక్స్, 3డి కోసం విడిగా వర్షన్లు సిద్ధం చేస్తున్నారు. ప్రాధమికంగా ఏప్రిల్ 11 లాక్ చేసుకున్నారు కానీ అధికారికంగా చెప్పలేదు.
ఈ లెక్కన కంగువా ఒక అరుదైన రికార్డుకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు పది భాషలే అన్నారు. ఇప్పుడు ఏకంగా ఇంకో ఇరవై ఎనిమిది జోడించారంటే బడ్జెట్ పరంగా ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కమర్షియల్ మసాలా సినిమాలతో బ్లాక్ బస్టర్లు తీసే సిరుతై శివ దీనికి దర్శకుడు. రజనీకాంత్ పెద్దన్న డిజాస్టర్ తర్వాత అతను చేస్తున్న భారీ చిత్రం ఇదే. సూర్య నెలల తరబడి దీనికి డేట్లు కేటాయించి వేరే సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టాడు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ విదేశాల్లో జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి.
యువి సంస్థ ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఎంత పెట్టుబడి అనేది బయటికి రాలేదు కానీ ఊహకందని మొత్తమే అయ్యుంటుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న బాబీ డియోల్ ఈ కంగువాతోనే కోలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. కనివిని ఎరుగని రీతిలో ఒక విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని జ్ఞానవేల్ రాజా టార్గెట్ గా కనిపిస్తోంది. అయితే గతంలో బాహుబలిని బీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని తీసిన విజయ్ పులి, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ఇతర రాష్ట్రాల ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. మరి కంగువా ఏం చేస్తుందో.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…