ఒక సింహా.. ఒక లెజెండ్.. నందమూరి బాలకృష్ణ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి. తన మార్కెట్, ఫాలోయిగ్ దెబ్బ తింటున్న సమయాల్లో వచ్చిన ఈ సినిమాలు బాలయ్యకు గొప్ప ఉపశమనాన్నిచ్చాయి. ఇప్పుడు బాలయ్య కెరీర్ మరోసారి ప్రమాదంలో ఉంది. అలాంటి తరుణంలోనే మళ్లీ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టాడు.
వీళ్లద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో బాలయ్య అఘోరా తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకోసమే గుండు కొట్టించుకున్నాడని ఒక రూమర్ హల్ చల్ చేసింది. అలాగే ఇదొక పొలిటికల్ డ్రామా అని కూడా ప్రచారం సాగింది. ఇంకా ఇందులో హీరోయిన్ల గురించి కూడా రకరకాల వార్తలొచ్చాయి.
ఐతే శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారాలపై బోయపాటి స్పందించాడు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాలయ్యతో తాను చేస్తున్న కొత్త చిత్రం పొలిటికల్ డ్రామా కాదని బోయపాటి తేల్చేశాడు. ఇదొక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో సరిపడా యాక్షన్ కూడా ఉంటుందని బోయపాటి తెలిపాడు.
ఇక అఘోరా పాత్ర గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా వారణాసిలో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య గెటప్, ఆయన నటన ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పడం ద్వారా అఘోరా తరహా పాత్ర ఉండే అవకాశముందని చెప్పకనే చెప్పాడు బోయపాటి.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇద్దరిని ఇంతకుముందు ఖరారు చేశామని.. కానీ లాక్ డౌన్ కారణంగా వాళ్ల డేట్ల విషయంలో సమస్య తలెత్తిందని.. షూటింగ్ మళ్లీ మొదలయ్యే సమయానికి పరిస్థితుల్ని బట్టి హీరోయిన్లు ఎవరనే విషయం చెప్పగలమని బోయపాటి స్పష్టత ఇచ్చాడు.
This post was last modified on April 26, 2020 9:38 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…