ఒక సింహా.. ఒక లెజెండ్.. నందమూరి బాలకృష్ణ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి. తన మార్కెట్, ఫాలోయిగ్ దెబ్బ తింటున్న సమయాల్లో వచ్చిన ఈ సినిమాలు బాలయ్యకు గొప్ప ఉపశమనాన్నిచ్చాయి. ఇప్పుడు బాలయ్య కెరీర్ మరోసారి ప్రమాదంలో ఉంది. అలాంటి తరుణంలోనే మళ్లీ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టాడు.
వీళ్లద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో బాలయ్య అఘోరా తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకోసమే గుండు కొట్టించుకున్నాడని ఒక రూమర్ హల్ చల్ చేసింది. అలాగే ఇదొక పొలిటికల్ డ్రామా అని కూడా ప్రచారం సాగింది. ఇంకా ఇందులో హీరోయిన్ల గురించి కూడా రకరకాల వార్తలొచ్చాయి.
ఐతే శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారాలపై బోయపాటి స్పందించాడు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాలయ్యతో తాను చేస్తున్న కొత్త చిత్రం పొలిటికల్ డ్రామా కాదని బోయపాటి తేల్చేశాడు. ఇదొక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో సరిపడా యాక్షన్ కూడా ఉంటుందని బోయపాటి తెలిపాడు.
ఇక అఘోరా పాత్ర గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా వారణాసిలో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య గెటప్, ఆయన నటన ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పడం ద్వారా అఘోరా తరహా పాత్ర ఉండే అవకాశముందని చెప్పకనే చెప్పాడు బోయపాటి.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇద్దరిని ఇంతకుముందు ఖరారు చేశామని.. కానీ లాక్ డౌన్ కారణంగా వాళ్ల డేట్ల విషయంలో సమస్య తలెత్తిందని.. షూటింగ్ మళ్లీ మొదలయ్యే సమయానికి పరిస్థితుల్ని బట్టి హీరోయిన్లు ఎవరనే విషయం చెప్పగలమని బోయపాటి స్పష్టత ఇచ్చాడు.
This post was last modified on April 26, 2020 9:38 pm
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…