ఒక సింహా.. ఒక లెజెండ్.. నందమూరి బాలకృష్ణ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి. తన మార్కెట్, ఫాలోయిగ్ దెబ్బ తింటున్న సమయాల్లో వచ్చిన ఈ సినిమాలు బాలయ్యకు గొప్ప ఉపశమనాన్నిచ్చాయి. ఇప్పుడు బాలయ్య కెరీర్ మరోసారి ప్రమాదంలో ఉంది. అలాంటి తరుణంలోనే మళ్లీ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టాడు.
వీళ్లద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో బాలయ్య అఘోరా తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకోసమే గుండు కొట్టించుకున్నాడని ఒక రూమర్ హల్ చల్ చేసింది. అలాగే ఇదొక పొలిటికల్ డ్రామా అని కూడా ప్రచారం సాగింది. ఇంకా ఇందులో హీరోయిన్ల గురించి కూడా రకరకాల వార్తలొచ్చాయి.
ఐతే శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారాలపై బోయపాటి స్పందించాడు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాలయ్యతో తాను చేస్తున్న కొత్త చిత్రం పొలిటికల్ డ్రామా కాదని బోయపాటి తేల్చేశాడు. ఇదొక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో సరిపడా యాక్షన్ కూడా ఉంటుందని బోయపాటి తెలిపాడు.
ఇక అఘోరా పాత్ర గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా వారణాసిలో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య గెటప్, ఆయన నటన ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పడం ద్వారా అఘోరా తరహా పాత్ర ఉండే అవకాశముందని చెప్పకనే చెప్పాడు బోయపాటి.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇద్దరిని ఇంతకుముందు ఖరారు చేశామని.. కానీ లాక్ డౌన్ కారణంగా వాళ్ల డేట్ల విషయంలో సమస్య తలెత్తిందని.. షూటింగ్ మళ్లీ మొదలయ్యే సమయానికి పరిస్థితుల్ని బట్టి హీరోయిన్లు ఎవరనే విషయం చెప్పగలమని బోయపాటి స్పష్టత ఇచ్చాడు.
This post was last modified on April 26, 2020 9:38 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…