బాలయ్య సినిమాపై బోయపాటి ఫుల్ క్లారిటీ

ఒక సింహా.. ఒక లెజెండ్.. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి. తన మార్కెట్, ఫాలోయిగ్ దెబ్బ తింటున్న సమయాల్లో వచ్చిన ఈ సినిమాలు బాలయ్యకు గొప్ప ఉపశమనాన్నిచ్చాయి. ఇప్పుడు బాలయ్య కెరీర్ మరోసారి ప్రమాదంలో ఉంది. అలాంటి తరుణంలోనే మళ్లీ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టాడు.

వీళ్లద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో బాలయ్య అఘోరా తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకోసమే గుండు కొట్టించుకున్నాడని ఒక రూమర్ హల్ చల్ చేసింది. అలాగే ఇదొక పొలిటికల్ డ్రామా అని కూడా ప్రచారం సాగింది. ఇంకా ఇందులో హీరోయిన్ల గురించి కూడా రకరకాల వార్తలొచ్చాయి.

ఐతే శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారాలపై బోయపాటి స్పందించాడు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాలయ్యతో తాను చేస్తున్న కొత్త చిత్రం పొలిటికల్ డ్రామా కాదని బోయపాటి తేల్చేశాడు. ఇదొక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో సరిపడా యాక్షన్ కూడా ఉంటుందని బోయపాటి తెలిపాడు.
ఇక అఘోరా పాత్ర గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా వారణాసిలో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య గెటప్, ఆయన నటన ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పడం ద్వారా అఘోరా తరహా పాత్ర ఉండే అవకాశముందని చెప్పకనే చెప్పాడు బోయపాటి.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇద్దరిని ఇంతకుముందు ఖరారు చేశామని.. కానీ లాక్ డౌన్ కారణంగా వాళ్ల డేట్ల విషయంలో సమస్య తలెత్తిందని.. షూటింగ్ మళ్లీ మొదలయ్యే సమయానికి పరిస్థితుల్ని బట్టి హీరోయిన్లు ఎవరనే విషయం చెప్పగలమని బోయపాటి స్పష్టత ఇచ్చాడు.

This post was last modified on April 26, 2020 9:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

2 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

3 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

4 hours ago