మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో మంగళవారం ఒక్కటే మంచి టాక్ తో వసూళ్లను రాబడుతోంది. యూనిట్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు నాలుగున్నర కోట్లకు పైగా గ్రాస్ రావడం పెద్ద విశేషమే. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ తో మార్కెటింగ్ చేసిన మూవీకి ఇలాంటి ఓపెనింగ్ తేలిగ్గా తీసుకునేది కాదు. ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ లేకపోయి ఉంటే కలెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపించేది. ఇప్పుడీ మ్యాచ్ పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారిపోయింది. నిన్న దిల్ రాజు అతిథిగా మంగళవారం టీమ్ సక్సెస్ మీట్ జరిపి తన ఆనందాన్ని పంచుకుంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ దర్శకుడు వంశీ తీసిన క్లాసిక్ థ్రిల్లర్ అన్వేషణ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది 1985లో వచ్చిన కల్ట్ మూవీ. సస్పెన్స్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇళయరాజా సంగీతం, అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపాయి. దీంట్లో కథేంటంటే ఆడవిలో వరసగా హత్యలు జరుగుతాయి. అవి పులి చేసిందన్న ప్రచారాన్ని గ్రామ ప్రజలు నమ్ముతారు. కేసుని విచారించడానికి వచ్చిన కార్తీక్ హీరోయిన్ భానుప్రియ సహాయంతో హంతకులెవరో పట్టుకుంటాడు. ఊహించని పరిణామాల మధ్య శరత్ బాబు, రాళ్ళపల్లిగా తేలుతారు. ఇక మంగళవారం విషయానికి వద్దాం.
పల్లెటూళ్ళో అక్రమ సంబంధాల హత్యలు, అందరూ అమ్మోరు శాపం అనుకోవడం, పాయల్ రాజ్ పుత్ మీద అనుమానం, చివరికి ఎవరూ ఊహించని మనిషి అసలు దోషిగా బయట పడటం, దాని వెనుకో షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ దర్శకుడు అజయ్ భూపతి చాలా షాకింగ్ గా చూపించారు. ముఖ్యంగా చివరి ముప్పావు గంట ట్విస్టులతో పరుగులు పెట్టించారు. అన్వేషణకు దీనికి నెరేషన్ స్టైల్ లో ఈ పోలికలు కనిపిస్తాయి. దిల్ రాజు, రివ్యూయర్లు ఈ కోణంలోనే వంశీ మేకింగ్ ని గుర్తు చేసుకున్నారు. అయినా అజయ్ భూపతి తానెంతో ఇష్టపడే వంశీతో పోలిక రావడం కన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది.
This post was last modified on November 19, 2023 12:02 pm
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…