ఇంకో ఐదు వారాలు మాత్రమే సమయం ఉంది ‘సలార్’ ఆగమనానికి. నెలన్నర ముందే విడుదల కావాల్సిన ఈ భారీ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల వాయిదా పడ్డ సంగతి తెలసిందే. నెల రోజులకు పైగా సస్పెన్స్ తర్వాత డిసెంబరు 22న రిలీజ్కు కొత్త డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోషన్లు ఊపందుకోకపోవడానికి పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన తలనొప్పులే కారణమని వార్తలు వచ్చాయి.
ఐతే బిజినెస్ డీల్స్ దాదాపుగా ఓకే అయినట్లే తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఏ రాష్ట్రంలో ఎవరు తమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటిస్తోంది ‘సలార్’ టీం. తాజాగా నైజాం ‘సలార్’ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి సస్పెన్సుకి తెరదించారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నదే నిజమని తేలింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ‘సలార్’ను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. నైజాం హక్కులను మైత్రీ వాళ్లు దాదాపు రూ.75 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేటు సంగతి చెప్పే అవకాశం లేదు కానీ.. దిల్ రాజును దాటి మైత్రీ వాళ్లు ఈ భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతుండటం మాత్రం విశేషమే. ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల వివరాలను సలార్ టీం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వరకు గీతా సంస్థ సినిమాను రిలీజ్ చేస్తోంది.
ఉత్తరాంధ్రకు శ్రీ సిరి సాయి సినిమాస్, సీడెడ్లో శిల్పకళా ఎంటర్ప్రైజెస్.. తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహా మణికంఠా ఫిలిమ్స్, కృష్ణా-గుంటూరులో కేఎస్ఎన్ టెలీ ఫిలిమ్స్, నెల్లూరులో వెంగమాంబ సినిమాస్ ‘సలార్’ను రిలీజ్ చేస్తున్నాయి. తమిళనాట ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్స్ హక్కులు దక్కించుకోగా.. ‘సలార్’లో విలన్ పాత్ర చేస్తున్న పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని కేరళలో రిలీజ్ చేస్తున్నాడు. కర్ణాటకలో హోంబలె ఫిలిమ్స్ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇక నార్త్ ఇండియా సంగతే ప్రకటించాల్సి ఉంది.
This post was last modified on November 17, 2023 5:59 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…