ఇంకో ఐదు వారాలు మాత్రమే సమయం ఉంది ‘సలార్’ ఆగమనానికి. నెలన్నర ముందే విడుదల కావాల్సిన ఈ భారీ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల వాయిదా పడ్డ సంగతి తెలసిందే. నెల రోజులకు పైగా సస్పెన్స్ తర్వాత డిసెంబరు 22న రిలీజ్కు కొత్త డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోషన్లు ఊపందుకోకపోవడానికి పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన తలనొప్పులే కారణమని వార్తలు వచ్చాయి.
ఐతే బిజినెస్ డీల్స్ దాదాపుగా ఓకే అయినట్లే తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఏ రాష్ట్రంలో ఎవరు తమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటిస్తోంది ‘సలార్’ టీం. తాజాగా నైజాం ‘సలార్’ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి సస్పెన్సుకి తెరదించారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నదే నిజమని తేలింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ‘సలార్’ను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. నైజాం హక్కులను మైత్రీ వాళ్లు దాదాపు రూ.75 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేటు సంగతి చెప్పే అవకాశం లేదు కానీ.. దిల్ రాజును దాటి మైత్రీ వాళ్లు ఈ భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతుండటం మాత్రం విశేషమే. ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల వివరాలను సలార్ టీం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వరకు గీతా సంస్థ సినిమాను రిలీజ్ చేస్తోంది.
ఉత్తరాంధ్రకు శ్రీ సిరి సాయి సినిమాస్, సీడెడ్లో శిల్పకళా ఎంటర్ప్రైజెస్.. తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహా మణికంఠా ఫిలిమ్స్, కృష్ణా-గుంటూరులో కేఎస్ఎన్ టెలీ ఫిలిమ్స్, నెల్లూరులో వెంగమాంబ సినిమాస్ ‘సలార్’ను రిలీజ్ చేస్తున్నాయి. తమిళనాట ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్స్ హక్కులు దక్కించుకోగా.. ‘సలార్’లో విలన్ పాత్ర చేస్తున్న పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని కేరళలో రిలీజ్ చేస్తున్నాడు. కర్ణాటకలో హోంబలె ఫిలిమ్స్ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇక నార్త్ ఇండియా సంగతే ప్రకటించాల్సి ఉంది.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…