మేనల్లుడు ఆశిష్ రెడ్డిని హీరోగా సెటిల్ చేయడం కోసం నిర్మాత దిల్ రాజు సెట్ చేస్తున్న కాంబినేషన్లు మాములుగా లేవు. మొదటి సినిమా రౌడీ బాయ్స్ కి అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకుని, దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా సెట్ చేయడం దగ్గరి నుంచే ఈ ప్లానింగ్ మొదలయ్యింది. రెండో మూవీ సెల్ఫిష్ కి బిజీగా ఉన్న సుకుమార్ తో రచన చేయించి మరీ రేంజ్ పెంచే విధంగా ప్రణాళికలు రచించారు. తర్వాత సినిమాకి బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యని తీసుకోవడం దాదాపు కన్ఫర్మే. ఇవన్నీ ఒక ఎత్తయితే శ్రీలీలను ఆశిష్ కి ఆన్ స్క్రీన్ జోడిగా తీసుకొచ్చే ట్రయిల్స్ ముమ్మరం చేశారని టాక్.
ఇంకా ప్రకటించలేదు కానీ తెరవెనుక ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా ఒక హిట్ మూవీ కరెక్ట్ గా పడితే కెరీర్ ఊపందుకుంటుంది. ఒక నిర్మాత కుటుంబం నుంచి స్టార్ హీరో తయారు కావడం చాలా అరుదు. ఒక్క రామానాయుడు గారికే అది సాధ్యమయ్యింది. పెద్దబ్బాయి సురేష్ బాబు నిర్మాణ వ్యవహారాలకు పరిమితమైతే వెంకటేష్ రెండో తరం అగ్ర హీరోల్లో ఒకరిగా తిరుగు లేని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు లక్ష్యం కూడా ఇదే అనిపిస్తోంది. ఆశిష్ ని ఎలాగైనా మార్కెట్ ఉన్న హీరో స్థాయికి తీసుకెళ్లాలి.
నెమ్మదిగానే షూటింగ్ జరుపుకుంటున్న సెల్ఫిష్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా దిల్ రాజు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారట. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆశిష్ కోసం ఇవన్ని చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ కుర్రాడికి సరైన బ్రేక్ దొరికితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడు. అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కానీ శిరీష్ ఇప్పటికీ కనీస స్థాయిలో కుదురుకోలేదు. ఇక్కడ మాట్లాడేది సక్సెస్ లే కాబట్టి ఆశిష్ కు ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు పడితే అప్పుడు నిర్మాతలు వద్దన్నా వెంట పడతారు.
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…