ఏ సినిమాకైనా రిలీజైన మొదటి వారంలో వీకెండ్ చాలా కీలకం. సండే వసూళ్లు ఎంత వచ్చాయేదనేదే ఓపెనింగ్ స్థాయిని నిర్దేశిస్తాయి. అయితే ముందే ఊహించిందే అయినా ఇండియా ప్రపంచ కప్ ఫైనల్ కు వెళ్లడం రేపు రిలీజయ్యే సినిమాలకు గండంగా మారింది. నవంబర్ 19 అహ్మదాబాద్ లో తుది సమరం జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి ఎవరన్నది ఇవాళ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే పోరులో నిర్ణయమవుతుంది. నిన్న సెమి ఫైనల్ దెబ్బకే చాలా చోట్ల థియేటర్లు బోసిపోయాయి. వర్కింగ్ డే అయినా సరే హాట్ స్టార్ లో 5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటిది ఫైనల్ అందులోనూ సెలవు రోజు వచ్చే క్రేజ్ గురించి వేరే చెప్పాలా. ఇళ్లలో నుంచి జనం బయటికి రావడం కష్టం. రెండు రోజుల ముందు మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి, మై నేమ్ ఈజ్ శృతి, స్పార్క్ లైఫ్, ఏ చోట నువ్వున్నా, జనం, అన్వేషి విడుదలవుతున్నాయి. పేరుకి ఏడు రిలీజులే కానీ మొదటి రెండు మినహాయించి మిగిలినవి టాక్ మీద ఆధారపడ్డవి. వచ్చే ఆదివారం క్రికెట్ మ్యాచ్ కు కృష్ణార్పణం అయిపోతే వసూళ్లలో పెద్ద కోత పడుతుంది. మ్యాచ్ మధ్యాన్నం రెండుకే అయినా మార్నింగ్ షోలకు సైతం జనం పల్చగానే ఉంటారు. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు లేవు.
తిరిగి సోమవారం సహజంగా ఉండే డ్రాప్ ఎలాగూ తప్పదు. డిసెంబర్ 24న ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ లు వస్తున్నాయి. ఆ లోగా సోషల్ మీడియాలో, పబ్లిక్ టాక్ లో బాగున్నాయని పేరు తెచ్చుకున్నవి తప్పించి మిగిలినవి నిలవడం కష్టం. సెమి ఫైనల్ రోజు సల్మాన్ అంతటి స్టార్ హీరో టైగర్ 3కే తిప్పలు తప్పలేదు. అలాంటిది బడ్జెట్ మూవీస్ గురించి చెప్పదేముంది. సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఇండియా ఫైనల్ కు చేరుకోవడంతో అభిమానుల్లో ఉద్వేగం మాములుగా లేదు. టాస్ తో మొదలుపెట్టి రాత్రి పది పదకొండు దాకా టీవీ సెట్ల ముందు నుంచి లేవడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…