ఇటీవలే దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి ప్రత్యేక ఆహ్వానితులతో జరిగిన సందడి మాములుగా లేదు. అయితే లోపల ఏమేం జరిగిందనే దాని గురించి మీడియాకు సైతం సరైన సమాచారం లేకుండా పోయింది. తాజాగా వీడియోలు బయటికి వస్తున్నాయి. వాటిలో జవాన్ టైటిల్ సాంగ్ కి 68 వయసులో చిరంజీవి వేసిన స్టెప్పులు విపరీతంగా వైరలవుతున్నాయి. అక్కడ చరణ్ తో పాటు ఇతర సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.
గాయని రాజకుమారితో ఇంట్లో కన్సర్ట్ పెట్టడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమెతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పించాలంటే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా మెగా ఫ్యామిలీకి అదేం పెద్ద మ్యాటర్ కాదు కానీ బాలీవుడ్ స్టైల్ లో ఇలా ప్లాన్ చేయడం మాత్రం కొత్తే. అందులోనూ ఒక ప్రైవేట్ పార్టీలో. గత కొన్నేళ్లలో చిరులో ఎప్పుడూ చూడనంత గ్రేస్ ఈ కొన్ని సెకండ్ల వీడియోలో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కదా మేము చూడాలనుకున్న డాన్సని సంబరపడుతున్నారు. జగదేకేవీరుడు అతిలోకసుందరి నాటి స్టైల్ కనిపిస్తే అంతే మరి.
ఇప్పుడు చేయబోయే విశ్వంభర ఫాంటసీ మూవీ కాబట్టి ఇలాంటి వాటికి స్కోప్ ఉందో లేదో దర్శకుడు వశిష్టనే చెప్పాలి. ఈ నెల మూడో వారం ఇతర ఆర్టిస్టులతో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాక డిసెంబర్ లో మెగాస్టార్ సెట్స్ లో అడుగు పెడతారట. ఎంఎం కీరవాణి నేతృత్వంలో ఒక పాట రికార్డింగ్ జరిగిపోగా మిగిలిన మ్యూజిక్ సిట్టింగ్స్ జనవరిలో పూర్తి చేస్తారు. భోళా శంకర్ దెబ్బకు కళ్యాణ్ కృష్ణ సినిమా పక్కనపెట్టి మరీ విశ్వంభరని ఎంచుకున్న చిరు మీద యువి క్రియేషన్స్ రెండు వందల కోట్ల బడ్జెట్ ని పెడుతోంది. బలంగా కంబ్యాక్ అవ్వడానికి ఇంతకన్నా గొప్ప ఛాన్స్ ఏముంటుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…