Movie News

సురేష్ రైనాకు ఏమైంది?

మామూలుగా వేసవి వచ్చిందంటే క్రికెట్ ప్రియులకు పండగే. ఏప్రిల్, మే నెలల్లో క్రికెట్ ప్రియుల ఫేవరెట్ టోర్నీ ఐపీఎల్ ఉర్రూతలూగిస్తుంది. కానీ కరోనా పుణ్యమా అని అన్నిట్లాగే ఆ వినోదానికీ గండి పడింది. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉండదేమో అన్న అనుమానాలూ కలిగాయి. కానీ బీసీసీఐ కష్టపడి యూఈఏలో లీగ్‌కు సన్నాహాలు చేసింది.

సెప్టెంబరు 19 నుంచి ఈ టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జట్లూ అక్కడికి చేరుకున్నాయి. ఐతే ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పేసర్ దీపక్ చాహర్ సహా సహాయ సిబ్బంది పది మంది దాకా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఇది చెన్నై జట్టుకే కాదు.. మొత్తం ఐపీఎల్‌కు గట్టి ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు. ఇది చాలదన్నట్లు చెన్నై టీంకు, ఐపీఎల్‌కు మరో షాక్ తగిలింది.

ఐపీఎల్ టాప్ ప్లేయర్లలో ఒకడు.. ‘మిస్టర్ ఐపీఎల్’ అని పేరు కూడా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా.. లీగ్ నుంచి తప్పుకున్నాడు. అతను వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమవుతున్నట్లు చెన్నై జట్టు ప్రకటించింది. అతను వెంటనే స్వదేశానికి బయల్దేరాడు. ఈ ఏడాది లీగ్ మొత్తానికి రైనా అందుబాటులో ఉండడని కూడా ప్రకటన వచ్చేసింది.

ఐతే కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకుని భార్యతో ఇద్దరు పిల్లలతో సంతోషంగా కనిపిస్తున్న రైనా.. ఉన్నట్లుండి ఐపీఎల్ నుంచి ఇలా దూరం కావాల్సినంత వ్యక్తిగత సమస్యలు అతడికేం ఉన్నాయో అర్థం కావడం లేదు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలేమైనా బయటపడ్డాయా అని సందేహిస్తున్నారు.

ఆగస్టు 15న ధోని రిటైరైన రోజు కాసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌కు అతను అంకితం అవుతాడనుకుంటే.. ఇలా అర్ధంతరంగా లీగ్‌ నుంచి తప్పుకోవడం ఐపీఎల్ ప్రియులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

This post was last modified on August 29, 2020 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

43 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago