ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా సరే జనం దృష్టిలో ఉన్న వాటిలో మొదటి స్థానం మంగళవారందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మొత్తానికి థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ఇప్పటికే టాక్ ఉంది. 13 కోట్ల దాకా అమ్మకాలు చేసినట్టు సమాచారం. ఈ రేంజ్ మూవీకి ఇది చాలా పెద్ద లెక్క. ట్రైలర్ చూశాక ఒక్కసారిగా బయ్యర్లలో హైప్ వచ్చేసింది. ఇదే జానర్ లో వచ్చిన విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 ఘనవిజయాలు కూడా దీనికో కారణమని చెప్పొచ్చు.
ఇదంతా ఒకే కానీ మంగళవారం భారం మొత్తం ట్విస్టుల మీద పడనుంది. ఇప్పటిదాకా ఏ తెలుగు హీరోయిన్ చేయని పాత్రను పాయల్ రాజ్ పుత్ కు ఆఫర్ చేశారు. అసభ్యత లేకుండా ఆమె ఎపిసోడ్ ని డిజైన్ చేసుకున్నారు. చివరి 45 నిముషాలు వచ్చే మలుపులతో ఆడియన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాక బయటికి వచ్చేటప్పుడు ఒక ఎమోషనల్ ఫీల్ తో పాటు పాయల్ క్యారెక్టర్ మీద సానుభూతితో ఆలోచిస్తారట. ఇంత కీలకంగా వ్యవహరించే ఈమె ఎంట్రీ ఇచ్చేది ఇంటర్వెల్ కు ముందు మాత్రమే. అంటే గంటకు పైగా సినిమా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టుల మీద నడుస్తుందన్న మాట.
దర్శకుడు అజయ్ భూపతి మంగళవారంని ఒక్క భాగంతో ఆపేయడం లేదు. సీక్వెల్ కూడా ఉంటుంది. దానికి ప్లానింగ్ కూడా జరిగిపోయింది. ఒకవేళ మహాసముద్రం హిట్ అయినా దీన్నే తీసేవాడినని అంత కాన్ఫిడెంట్ గా చెప్ప్పడం చూస్తుంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే అనిపిస్తోంది. సప్తసాగరాలు దాటి సైడ్ బితో పాటు స్పార్క్ తో తలపడుతున్న మంగళవారంకు బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ ఉంది. టాక్ డీసెంట్ గా వచ్చినా చాలు భారీ వసూళ్లు దక్కుతాయి. ఎలాగూ జపాన్, జిగర్ తండ డబుల్ ఎక్స్ లు ఫ్లాపయ్యాయి. టైగర్ 3 బాగా నెమ్మదిస్తోంది. సో ఇంతకన్నా అవకాశం దొరకదు.
This post was last modified on November 14, 2023 4:52 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…