Movie News

థియేటర్లో బాణాసంచా ఇదేం పైత్యం

అభిమాన హీరో సినిమాని మొదటి రోజు చూస్తున్నప్పుడు అభిమానుల్లో ఒకరకమైన ఉద్వేగం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే కేవలం రెండున్నర గంటల వినోదానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయని వాళ్ళను ఎందరినో చూస్తుంటాం. అయితే ఇటీవలే కాలంలో ఫ్యానిజం పేరుతో కొందరు హద్దులు దాటడం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టేలా చేస్తోంది. మనకేదైనా పైత్యం ఉంటే అది పక్కవాళ్ళ మీద చూపించకూడదు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా మారతాయి. టైగర్ 3 విడుదల సందర్భంగా జరిగిన సంఘటన దీన్ని స్పష్టం చేస్తోంది.

మహారాష్ట్రలోని మలేగావ్ పట్టణంలో ఉన్న ఒక సింగల్ స్క్రీన్ లో టైగర్ 3 భారీ ఎత్తున విడుదలయ్యింది. రాత్రి సెకండ్ షో మొదలయ్యాక సుమారు 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో సల్మాన్ ఎంట్రీ సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారి బాణాసంచా బయటికి తీసి నేరుగా సీట్ల మధ్యలో కాల్చడం మొదలుపెట్టారు. వాటిలో రాకెట్లు, చిచ్చు బుడ్లు, సీమ టపాకాయలు, లక్ష్మి బాణాలు ఇలా అన్ని రకాలు ఉన్నాయి. నిప్పు రవ్వలు ఎగజిమ్ముతూ పై నుంచి కిందకు పడుతూ ఉంటే హౌస్ ఫుల్ గా ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ప్రాణ నష్టం జరగలేదు.

ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాద్యులు. అసలు అంత భారీ ఎత్తున టపాసులను లోపలి అనుమతించిన సదరు థియేటర్ యాజమాన్యాన్ని ముందుగా బాధ్యత వహించేలా చేయాలి. పోలీసులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ హాలులో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ కు సైతం ఇదే చేశారు. ఇప్పుడు సల్మాన్ ఫ్యాన్స్ వంతు రావడంతో మరికాస్త రెచ్చిపోయారు. థియేటర్లలో అగ్ని ప్రమాదాలు ఎంతటి విషాదానికి తెరతీస్తాయో తెలియాలంటే 1997లో జెపి దత్తా బోర్డర్ ఆడిన ఢిల్లీ ఉపహార్ సంఘటనలో ప్రాణ నష్టం చూస్తే తెలుస్తుంది.

This post was last modified on November 13, 2023 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

44 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago