Movie News

థియేటర్లో బాణాసంచా ఇదేం పైత్యం

అభిమాన హీరో సినిమాని మొదటి రోజు చూస్తున్నప్పుడు అభిమానుల్లో ఒకరకమైన ఉద్వేగం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే కేవలం రెండున్నర గంటల వినోదానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయని వాళ్ళను ఎందరినో చూస్తుంటాం. అయితే ఇటీవలే కాలంలో ఫ్యానిజం పేరుతో కొందరు హద్దులు దాటడం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టేలా చేస్తోంది. మనకేదైనా పైత్యం ఉంటే అది పక్కవాళ్ళ మీద చూపించకూడదు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా మారతాయి. టైగర్ 3 విడుదల సందర్భంగా జరిగిన సంఘటన దీన్ని స్పష్టం చేస్తోంది.

మహారాష్ట్రలోని మలేగావ్ పట్టణంలో ఉన్న ఒక సింగల్ స్క్రీన్ లో టైగర్ 3 భారీ ఎత్తున విడుదలయ్యింది. రాత్రి సెకండ్ షో మొదలయ్యాక సుమారు 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో సల్మాన్ ఎంట్రీ సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారి బాణాసంచా బయటికి తీసి నేరుగా సీట్ల మధ్యలో కాల్చడం మొదలుపెట్టారు. వాటిలో రాకెట్లు, చిచ్చు బుడ్లు, సీమ టపాకాయలు, లక్ష్మి బాణాలు ఇలా అన్ని రకాలు ఉన్నాయి. నిప్పు రవ్వలు ఎగజిమ్ముతూ పై నుంచి కిందకు పడుతూ ఉంటే హౌస్ ఫుల్ గా ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ప్రాణ నష్టం జరగలేదు.

ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాద్యులు. అసలు అంత భారీ ఎత్తున టపాసులను లోపలి అనుమతించిన సదరు థియేటర్ యాజమాన్యాన్ని ముందుగా బాధ్యత వహించేలా చేయాలి. పోలీసులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ హాలులో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ కు సైతం ఇదే చేశారు. ఇప్పుడు సల్మాన్ ఫ్యాన్స్ వంతు రావడంతో మరికాస్త రెచ్చిపోయారు. థియేటర్లలో అగ్ని ప్రమాదాలు ఎంతటి విషాదానికి తెరతీస్తాయో తెలియాలంటే 1997లో జెపి దత్తా బోర్డర్ ఆడిన ఢిల్లీ ఉపహార్ సంఘటనలో ప్రాణ నష్టం చూస్తే తెలుస్తుంది.

This post was last modified on November 13, 2023 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago