బాలీవుడ్ను ఖాన్ త్రయం దశాబ్దాల నుంచి ఏలుతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ ఒకే టైంలో టాప్ ఫాంలో ఉండటం అరుదు. 2000 తర్వాత చాలా ఏళ్లు ఆమిర్ ఖాన్ ఆధిపత్యం చలాయించాడు. కానీ ఈ మధ్య ఆమిర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ దెబ్బకు కొత్త సినిమా ప్రకటించకుండా సైలెంట్ అయిపోయాడు. షారుఖ్ ఖాన్ మధ్యలో చాలా ఏళ్లు తడబడి ఈ ఏడాది బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు షారుఖ్ ఊపు మామూలుగా లేదు.
ఇక ఖాన్ త్రయంలో మూడో వాడైన సల్మాన్ ఖాన్ మధ్యలో ఒక దశాబ్దం పాటు హవా నడిపించాడు. అతడి సినిమాలు యావరేజ్ టాక్తోనే ఇరగాడేసేవి. కానీ ప్రేక్షకుల అభిమానాన్ని గ్రాంటెడ్గా తీసుకుని సిల్లీ సినిమాలు చేయడంతో అతడి ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తింటూ వచ్చింది. సల్మాన్ నిఖార్సయిన హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది.
ఒక టైంలో భజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి సినిమాలతో టాప్ ఫాంలో ఉన్న కండల వీరుడు.. గత ఆరేడేళ్లలో పేలవమైన సినిమాలు చేసి పేరు దెబ్బ తీసుకున్నాడు. రేస్-3, దబంగ్-3, రాధే, అంతిమ్, కిసీ కా భాయ్ కిసి కి జాన్.. ఇలా అన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. సల్మాన్ అనగానే ఊగిపోయి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేసే పరిస్థితి ఇప్పుడు ఎంతమాత్రం లేదని ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’ ఫలితం చూస్తే అర్థమైంది. ఈ స్థితిలో తనకు బాగా కలిసొచ్చిన ‘టైగర్’ ఫ్రాంఛైజీ మీదే ఆశలు పెట్టుకున్నాడు సల్మాన్.
ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్లు కావడంతో ‘టైగర్-3’ కూడా ఆ జాబితాలోకే చేరుతుందని అభిమానులు కూడా ధీమాగా ఉన్నారు. కానీ ఆదివారం రిలీజైన ‘టైగర్-3’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. టైగర్ ఫ్రాంఛైజీలో గత రెండు చిత్రాలకు దరిదాపుల్లో కూడా ఇది నిలిచేలా లేదు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మినహాయిస్తే ఇందులో మెరుపులు లేవు. కథలో కొత్తదనం.. మెరుపులు కొరవడి సామాన్య ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సల్మాన్కు బాగా కలిసొచ్చిన ‘టైగర్’ ఫ్రాంఛైజీ కూడా కాపాడలేదంటే.. ఇక సల్మాన్ కెరీర్ ఎలా గాడిన పడుతుందో?
This post was last modified on November 13, 2023 12:07 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…