పక్క రాష్ట్రంలో సల్మాన్ ఖాన్ టైగర్ 3కి విడుదల రోజు ఉదయం ఏడు గంటల ఆటలకు అనుమతులిచ్చి ఆ మేరకు షోలు వేయడం అక్కడి హీరోల అభిమానుల్లో పెద్ద చిచ్చు రేపుతోంది. వాస్తవానికి తమిళనాడు సర్కారు ఉదయం 9 గంటల కన్నా ముందు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ప్రదర్శించకూడదని కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. ఈ విషయంగా లియోకు పెద్ద రచ్చే అయ్యింది. ముందు తెల్లవారుఝామున 4 గంటల అనుమతితో జిఓ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ రద్దు చేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అంతకు ముందు రజనీకాంత్ జైలర్ పరిస్థితి కూడా ఇంతే.
అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ కు మాత్రమే ఎలా స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారని తలైవి, తలపతి అభిమానుల ప్రశ్న. కానీ గవర్నమెంట్ తరఫున ప్రతినిధుల వెర్షన్ వేరేగా ఉంది. పనిదినాల్లో రిలీజ్ చేసే వాటికి మాత్రమే పర్మిషన్లు, టైగర్ 3 ఆదివారం వచ్చింది కాబట్టి ఆ కండీషన్ వర్తించదని అంటున్నారు. ఇందులో లాజిక్ ఉంది కానీ ఈ అంశాన్ని గతంలో ఎప్పుడూ హైలైట్ చేయలేదు. అదే నిజమైతే లియో, జైలర్ లకు మూడో రోజు స్పెషల్ షోలు వేసుకునే వాళ్ళం కదాని బయ్యర్లు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. షోలు పడ్డాయని చెప్పేందుకు ప్రూఫ్ గా బుక్ మై షోల స్క్రీన్ షాట్లు కూడా పెట్టుకున్నారు ఫ్యాన్స్.
ఎక్కడా లేని విధంగా తమ దగ్గరే ఇలా ఆంక్షలు పెట్టడం ఏమిటనేది కోలీవుడ్ మూవీ లవర్స్ ఆవేదన. సిఎం స్టాలిన్ కొడుకు స్వయానా మంత్రి కం హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ దీని పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోకపోవడం నిరసనకు కారణమవుతోంది. నిజానికి తెల్లవారకుండానే తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఫ్యాన్స్ కి ఎగ్జైట్మెంట్ ఉండటం సహజం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా కేవలం స్పెషల్ షోల వల్లే ఏదో తీరని నష్టం జరుగుతోందన్నట్టు వ్యవహరించడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం.
This post was last modified on November 13, 2023 6:07 am
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…