హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు తీయడంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులున్న మార్వెల్స్ సంస్థ తన బ్యానర్ నే పేరుగా పెట్టుకుని తీసిన మూవీకి బాక్సాఫీస్ వద్ద ఘోరమైన అవమానం దక్కుతోంది. ఏ మాత్రం కొత్తదనం లేని కథా కథనాలతో ప్రేక్షకులను వెర్రివాళ్ళుగా జమకట్టి చేసిన ప్రయత్నం అడ్డంగా బోల్తా కొట్టింది. కేవలం 1 గంట 45 నిమిషాల నిడివే ఉన్నప్పటికీ ఆద్యంతం కుదురుగా కూర్చుని చూసేందుకు ఆడియన్స్ చాలా కష్టపడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొన్ని గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ అసలైన కంటెంట్ లో ఫీల్ లేకపోవడం మొత్తంగా దెబ్బ కొట్టింది.
మార్వెల్ నుంచి ఇప్పటిదాకా 32 చిత్రాలు వచ్చాయి. ఇది ముప్పై మూడవది. వాటిలో లేనిది ఇందులో ఉన్నది ఒక్కటంటే ఒక్కటి లేదని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పిల్లలను పెద్దలను అలరించేందుకు అవసరమైన అన్ని అంశాలు, సూపర్ హీరో ఎలిమెంట్స్ రాసుకున్నారు కానీ వాటిని సరైన రీతిలో ప్రెజెంట్ చేసి మెప్పించడంలో దర్శకుడు నియా డకోస్టా దారుణంగా విఫలమవ్వడంతో వీకెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా ఇండియాలో తీసికట్టుగా ఉన్నాయి.
అవెంజర్స్ తర్వాత మర్వెల్స్ తీసిన వాటిలో దేనికీ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. ఆడియన్స్ ని సంతృప్తి పరచలేక నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. నాలుగు వేల థియేటర్లలో గ్రాండ్ గా వచ్చిన మార్వెల్స్ కి ఇలాంటి స్పందన రావడం పట్ల దాని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా ఒకే కథను తిప్పి తిప్పి తీసి మోహాన కొడుతుంటే జనం మాత్రం ఏం చేయగలరు. ఎంతసేపూ విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకోవడం తప్ప కొత్తగా ఆలోచించాలన్న తపన లేనప్పుడు ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. అందుకే జేమ్స్ క్యామరూన్ అవతార్ కోసం అన్నేసి సంవత్సరాలు కష్టపడేది. ఈ కారణంగానే క్లాసిక్స్ వస్తాయి.
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…