ఇవాళ విడుదలైన టైగర్ 3 స్పెషల్ క్యామియోల మీద గత వారం రోజులుగా భారీ ప్రచారం జరిగింది. షారుఖ్ ఖాన్ గురించి ముందే తెలిసింది కాబట్టి కనిపించిన ఆ కాసేపు ఇద్దరి హీరోల అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే చివరిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడని, వార్ 2కి సంబంధించిన కీలక లీడ్ ఇస్తారని బాలీవుడ్ మీడియా తెగ ఊదరగొట్టింది. ఇదంతా పబ్లిసిటీలో భాగమేనని, తారక్ లేని విషయాన్ని మనోళ్లు ముందే పసిగట్టారు. దీన్ని నిజం చేస్తూ టైగర్ 3 ఎండ్ టైటిల్స్ అయిపోయాక కేవలం హృతిక్ రోషన్ కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించే షాట్ తో మమ అనిపించారు.
దీంతో ఏదేదో ఊహించుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందారు. వార్ 2లో హృతిక్ పోషించిన పాత్ర పేరు కబీర్. అది మొదటి భాగంలో ఓ రేంజ్ లో పేలింది. దానికి సరైన బిల్డప్ సెట్ చేసుకోవాలి. కానీ టైగర్ 3లో ఏదో మొక్కుబడిగా ఒక సన్నివేశం రాసుకుని, అశుతోష్ రానాతో చిన్న ఎలివేషన్ డైలాగు చెప్పించి, ఓ రౌడీ గుంపుని నరికించి మేనేజ్ చేశారు. అయితే కీలక ట్విస్టు ఒకటి ఇచ్చారు. కరుడు గట్టిన సైతాన్ కంటే ప్రమాదకరమైన వాడు ఒకడు వచ్చాడని, వాడితో తలపడాలంటే అంతకన్నా దారుణంగా మారిపోవాలని కబీర్ కి రా ఛీఫ్ సూచించడం ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చినట్టే ఉంది.
అది జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించేనని ఇన్ సైడ్ టాక్. కానీ వర్ణించిన తీరు చూస్తేనేమో విలన్ తరహాలో ఉంది. మరి తారక్ అక్కడి డెబ్యూకి ఇలాంటి కథను ఎంచుకుంటాడా అంటే చెప్పలేం. ఒకవేళ దీనికి బదులు హృతిక్, తారక్ లు పరస్పరం కలుసుకునే చిన్న ఫ్రేమ్ ఉన్నా చాలు థియేటర్లు దద్దరిల్లిపోయేవి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న వార్ 2 ని 2025 జనవరిలో విడుదల చేసేందుకు యష్ ఫిలింస్ ప్లాన్ చేస్తోంది. స్పై యునివర్స్ లో భాగంగా ఇకపై తారక్ కూడా రెగ్యులర్ గా ఈ సిరీస్ లో నటించే అవకాశముంది. అది వార్ 2 బ్లాక్ బస్టర్ కావడం మీద ఆధారపడి ఉంటుంది.
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…