జైలర్ ఇండస్ట్రీ హిట్ తో ఫుల్ జోష్ లోకి వచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు నెలలు తిరక్కుండానే సంక్రాంతికి లాల్ సలాంతో రాబోతున్నారు. ఇందులో ఆయన ఫుల్ లెన్త్ హీరో కాకపోయినా కాస్త ఎక్కువ నిడివి ఉన్న క్యామియో కావడంతో బిజినెస్ కూడా ఆ కోణంలోనే భారీగా జరుగుతోంది. రజని కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం అంచనాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో స్పష్టంగా రివీల్ చేశారు.
అదో చిన్న ఊరు. అక్కడ రెండు మతాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. క్రికెట్ పోటీ జరిగితే ఇరు వర్గాలు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ రేంజ్ లో గ్రౌండ్ కి వచ్చి భావోద్వేగాలను బయట పెట్టుకుంటాయి. అయితే ఓ సంఘటన ఈ గ్రామం తలరాతను మారుస్తుంది. కొట్టుకోవడంతో మొదలై రక్తం చిందే హత్యల దాకా వెళ్తుంది. ధనవంతుడైన ఓ పెద్దమనిషి(రజనీకాంత్) ఇదంతా చూసి కలత చెందుతాడు. పరిష్కారానికి పూనుకుంటాడు. అదంత సులభంగా ఉండదు. దీంట్లో కీలకంగా వ్యవహరించిన ఓ కుర్రాడి(విష్ణు విశాల్)కి ఈ సంఘటనకి సంబంధం ఏంటనేది సినిమాలో చూడాలి.
టేకింగ్ పరంగా ఐశ్వర్య అనుభవమున్న దర్శకురాలిగా తీసినట్టు విజువల్స్ లో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ ని ఎలివేట్ చేసింది. ముస్లిం పెద్ద గెటప్ లో రజినీకాంత ఆహార్యం డిఫరెంట్ గా ఉంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో హెవీ ఎమోషన్స్ మీద కథను నడిపించినట్టు అర్థమవుతోంది. విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబీ రామయ్య, వివేక్ ప్రసన్న ఇలా క్యాస్టింగ్ మొత్తం తమిళ బ్యాచే ఉంది. పొంగల్ రిలీజ్ అని మరోసారి స్పష్టం చేశారు కాబట్టి లాల్ సలామ్ ఈసారి పండక్కు అయిదారు స్ట్రెయిట్ తెలుగు సినిమాలను ఢీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డేట్ ఇవ్వలేదు.
This post was last modified on November 12, 2023 1:58 pm
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…