జైలర్ ఇండస్ట్రీ హిట్ తో ఫుల్ జోష్ లోకి వచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు నెలలు తిరక్కుండానే సంక్రాంతికి లాల్ సలాంతో రాబోతున్నారు. ఇందులో ఆయన ఫుల్ లెన్త్ హీరో కాకపోయినా కాస్త ఎక్కువ నిడివి ఉన్న క్యామియో కావడంతో బిజినెస్ కూడా ఆ కోణంలోనే భారీగా జరుగుతోంది. రజని కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం అంచనాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో స్పష్టంగా రివీల్ చేశారు.
అదో చిన్న ఊరు. అక్కడ రెండు మతాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. క్రికెట్ పోటీ జరిగితే ఇరు వర్గాలు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ రేంజ్ లో గ్రౌండ్ కి వచ్చి భావోద్వేగాలను బయట పెట్టుకుంటాయి. అయితే ఓ సంఘటన ఈ గ్రామం తలరాతను మారుస్తుంది. కొట్టుకోవడంతో మొదలై రక్తం చిందే హత్యల దాకా వెళ్తుంది. ధనవంతుడైన ఓ పెద్దమనిషి(రజనీకాంత్) ఇదంతా చూసి కలత చెందుతాడు. పరిష్కారానికి పూనుకుంటాడు. అదంత సులభంగా ఉండదు. దీంట్లో కీలకంగా వ్యవహరించిన ఓ కుర్రాడి(విష్ణు విశాల్)కి ఈ సంఘటనకి సంబంధం ఏంటనేది సినిమాలో చూడాలి.
టేకింగ్ పరంగా ఐశ్వర్య అనుభవమున్న దర్శకురాలిగా తీసినట్టు విజువల్స్ లో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ ని ఎలివేట్ చేసింది. ముస్లిం పెద్ద గెటప్ లో రజినీకాంత ఆహార్యం డిఫరెంట్ గా ఉంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో హెవీ ఎమోషన్స్ మీద కథను నడిపించినట్టు అర్థమవుతోంది. విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబీ రామయ్య, వివేక్ ప్రసన్న ఇలా క్యాస్టింగ్ మొత్తం తమిళ బ్యాచే ఉంది. పొంగల్ రిలీజ్ అని మరోసారి స్పష్టం చేశారు కాబట్టి లాల్ సలామ్ ఈసారి పండక్కు అయిదారు స్ట్రెయిట్ తెలుగు సినిమాలను ఢీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డేట్ ఇవ్వలేదు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…