ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్లో సందడంతా అనువాద చిత్రాలదే. కనీసం ఓ చిన్న సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయలేదు. ఉన్న ఒక్క సినిమా ‘ఆదికేశవ’ను 24కు వాయిదా వేసేసిన సంగతి తెలిసిందే. దీపావళికి ఎప్పుడూ భారీ చిత్రాలను రిలీజ్ చేస్తే కోలీవుడ్, బాలీవుడ్.. ఈసారి కూడా క్రేజీ చిత్రాలను బరిలోకి దింపాయి. ఆ చిత్రాలు తెలుగులో కూడా పెద్ద ఎత్తునే రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే శుక్రవారం రిలీజైన రెండు తమిళ అనువాదాలకు తెలుగులో సరైన స్పందన రాలేదు.
కార్తి మూవీ ‘జపాన్’ మంచి బజ్తో రిలీజవగా.. తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. టాక్ ఆశాజనకంగా లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. రెండో రోజు వసూళ్లు పడిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’కు తమిళంలో టాక్ బాగుంది కానీ.. తెలుగు వాళ్లకు అది రుచించడం లేదు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా బాగా లేవు. దీంతో సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు.
మొత్తంగా తమిళ డబ్బింగ్ చిత్రాల పనైపోయినట్లే కనిపిస్తోంది. ఇది బాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘టైగర్-3’కి బాగా కలిసొచ్చేదే. ఈ చిత్రం ఆదివారం రిలీజవుతోంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న ఈ చిత్రానికి తెలుగులో కూడా పెద్ద ఎత్తునే స్క్రీన్లు ఇచ్చారు. రెండు తమిళ చిత్రాలూ తుస్సుమనిపించడంతో ఫోకస్ అంతా ఈ సినిమా మీదికి మళ్లబోతోంది.
టైగర్ ఫ్రాంఛైజీలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. అందులోనూ ఇందులో షారుఖ్, హృతిక్ల క్యామియోలు కూడా ఉన్నాయంటున్నారు. సల్మాన్, కత్రినా జోడీ మీదా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా చాలు బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. తెలుగులో కూడా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…