ఈ మధ్య కమర్షియల్ సినిమాలకు దూరంగా బయోపిక్కులు, యాక్షన్ ఎంటర్ టైనర్లు చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఇకపై కూడా ప్రయోగాలు కొనసాగించేలా ఉన్నాడు. జనవరిలో సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈగల్ కూడా ఒకరకమైన ఎక్స్ పరిమెంటే. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని అప్ డేట్స్ వస్తున్నాయి కానీ వాటిలో ఒక కాంబో ఆసక్తి రేపుతోంది. కిరణ్ అబ్బవరంకి వినరో భాగ్యము విష్ణుకథ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బురు చెప్పిన ఒక లైన్ ఆసక్తికరంగా అనిపించడంతో ఫైనల్ వెర్షన్ అయ్యాక మళ్ళీ వింటానని చెప్పారట.
లెనిన్ టైటిల్ తో 90 బ్యాక్ డ్రాప్ లో చాలా డిఫరెంట్ సెటప్ తో ఉంటుందని వినికిడి. నెరేషన్ ఆసక్తికరంగా అనిపించడంతో ఒకవేళ చివరి డిస్కషన్ కనక వర్కౌట్ అయితే తెరకెక్కే అవకాశాలున్నాయని వినికిడి. లెనిన్ పేరు పెట్టడం వెనుక కూడా చాలా హోమ్ వర్క్ చేసి మరీ ఎంచుకున్నారట. రంగస్థలం నుంచి పీరియాడిక్ డ్రామాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రవితేజ లాంటి హీరోలు అలాంటివి చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. మరి లెనిన్ వెనుక ఉన్న అసలు సంగతేంటో తెలియాలంటే ఓకే అయ్యే దాకా చెప్పలేం. కిరణ్ తో చేశాక మురళి కిషోర్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారట.
ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో వర్క్ చేస్తున్న మాస్ మహారాజా నెక్స్ట్ అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాల్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తర్వాత రాజా ది గ్రేట్ కాంబోని రిపీట్ చేసేందుకు అనిల్, రవి ఇద్దరూ సానుకూలంగా ఉన్నారట. ఇక్కడ చెప్పిన రెండు కాంబోలకు ఇంకా నిర్మాత ఎవరన్నది డిసైడ్ అవ్వలేదు. స్క్రిప్ట్ లు లాక్ చేశాకే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఈ ఏడాది రవితేజకు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావులు నిరాశ పరిచినా ఈగల్ మీద మాత్రం టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. అందుకే విపరీతమైన పోటీ ఉన్నా సరే జనవరి 13నే రిలీజ్ చేస్తున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…