ఆదివారం విడుదల కాబోతున్న టైగర్ 3 మీద ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే పాజిటివ్ టాక్ వస్తే చాలు వసూళ్ల మోత ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముందస్తు అమ్మకాల్లో పఠాన్, జవాన్ కంటే వెనుబడటం ఫ్యాన్స్ లో ఆందోళన రేపుతోంది. మూడు లక్షలకు దగ్గరగా టికెట్లు సేల్ కావడం చిన్న విషయం కాదు కానీ షారుఖ్ ఖాన్ ని మించి సల్మాన్ ఇమేజ్ ఉందని ఋజువు చేయాలంటే ఈ ఫిగర్లే కీలకం కాబోతున్నాయి. ఇంకో రోజు టైం ఉంది కాబట్టి వేచి చూడాలి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
టైగర్ 3 యష్ రాజ్ ఫిలింస్ సృష్టించిన స్పై యునివర్స్ లో భాగంగా వస్తుందన్న సంగతి తెలిసిందే. టైగర్ జిందా హై, పఠాన్, వార్ లను కలుపుతూ ఈ మూడు సినిమాల హీరోలను ఒక తాటి పైకి భవిష్యత్తులో తీసుకొస్తారు. దానికి శాంపిల్ గా టైగర్ 3లో షారుఖ్ ఖాన్ పావు గంటకు పైగా కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్ ని కూడా దర్శనమివ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ ని ఇటీవలే చిత్రీకరించి ముందు లాక్ చేసుకున్న నిడివికి అదనంగా రెండున్నర నిముషాలు కలిపారు. ట్విస్ట్ ఏంటంటే వార్ 2 లో నటించబోయే జూనియర్ ఎన్టీఆర్ సైతం వీళ్ళతో పాటు కనిపిస్తాడట.
ఇందులో నిజమెంతుందో నిర్ధారణగా చెప్పలేం. పూర్తిగా కొట్టిపారేయలేం కానీ దేవరతో చాలా బిజీగా ఉన్న తారక్ అసలు ఎవరికీ తెలియకుండా టైగర్ 3లో నటించి ఉంటాడా అంటే డౌటే. ముంబై వర్గాలు మాత్రం కన్ఫర్మ్ అని నొక్కి వక్కాణిస్తున్నాయి. వార్ 2 రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ప్రస్తుతం హృతిక్, తారక్ తో అవసరం లేని పార్ట్ ని తీస్తున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో ఇద్దరు హీరోలు సెట్లో అడుగు పెడతారు. స్పై యూనివర్స్ అన్నారు కాబట్టి ఒకవేళ అలా ఒకటి రెండు షాట్స్ లో తారక్ ఏమైనా మెరుస్తాడేమో ఇంకో నలభై ఎనిమిది గంటల్లో తేలుతుంది.
This post was last modified on November 10, 2023 4:11 pm
రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్…
ఒకపక్క బాలీవుడ్ రామాయణంకు అడుగులు వేగంగా పడటంతో ఇంకోవైపు ఇలాంటి ఎపిక్ డ్రామాలను ప్లాన్ చేసుకున్న ఇతర హీరోలు, నిర్మాతలు…
ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా వేదికగా డిబేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారం చివరి…
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ గురించి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన…