రేపు శుక్రవారం మొదలుపెట్టి ఆదివారం దాకా టాలీవుడ్ బాక్సాఫీస్ కు డబ్బింగ్ సినిమాలే దిక్కవుతున్నాయి. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల దీపావళిని తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు వదిలేసుకున్నాయి. కార్తీ ‘జపాన్’ మీద ఓ మోస్తరు అంచనాలున్నాయి. బుకింగ్స్ నెమ్మదిగా సాగుతుండగా కార్తీ ఏకధాటిగా ప్రమోషన్లలో పాల్గొని వీలైనంత బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ పరంగా పెద్దగా క్రేజ్ లేని అంశాలు తోడవ్వడంతో భారం మొత్తం తన మీదే పడింది. లారెన్స్ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ కోసం అతను ఎస్జె సూర్య కలిసి తెలుగు మీడియాకు అలసిపోకుండా నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు
దీనికీ ఏమంత హైప్ లేదు కానీ టాక్ వస్తే ఒక్కసారిగా పై రెండు ఊపందుకునే ఛాన్స్ లేకపోలేదు. ఒక రోజు గ్యాప్ తో స్రవంతి రవికిశోర్ ‘దీపావళి’ని తీసుకొస్తున్నారు. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టులు తప్ప హీరోలు లేరు. బలగం రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని నిర్మాత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ అదెంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి. రేపే హాలీవుడ్ మూవీ ‘ది మార్వెల్స్’ ని దింపుతున్నారు. ఇది ఏ మేరకు జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి. సండే రోజు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ తో దూసుకొస్తాడు. బుకింగ్ అరాచకంగా లేవు కానీ ఇండియా వైడ్ రెండు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.
ఇవన్నీ కాకున్నా ‘అలా నిన్ను చేరి’ అనే ఇంకో డైరెక్ట్ మూవీ తప్ప నేరుగా వస్తున్న తెలుగు సినిమాలైతే లేవు. ఇన్నేసి అనువాద చిత్రాలు ఒకేసారి రావడం మాత్రం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. వినాయక చవితి టైంలోనూ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల దాన్ని మార్క్ ఆంటోనీకి వదిలేయాల్సి వచ్చింది. దాని వల్ల వచ్చిన ఫలితమూ సున్నానే. ఇప్పుడు పైన చెప్పిన వాటిలో ఏవి జనాన్ని ఆకట్టుకుంటాయో చూడాలి. మా ఊరి పొలిమేర 2, కీడా కోలా, భగవంత్ కేసరి రన్ కొనసాగబోతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సెలవు తీసుకోవడం లాంఛనమే. ఓటిటి లియో నవంబర్ 16 వచ్చేస్తుంది.
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…