ఒక కథ అనుకుని దాంతో సినిమా మొదలుపెట్టాక ఫుటేజ్ ఎక్కువైంది అనిపిస్తే చాలు.. సెకండ్ పార్ట్ అంటున్నారు ఈ మధ్య ఫిలిం మేకర్స్. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడం.. రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టినప్పటి నుంచి ఈ ఒరవడి ఊపందుకుంది. ‘పుష్ప’ను కూడా ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత రెండు భాగాలు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు మూడో భాగం తీసే ఆలోచన కూడా ఉందట.
కానీ అదెంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. కాగా దక్షిణాదిన తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘ఇండియన్-2’ కూడా అంతటితో ఆగిపోదట. దానికి కూడా మూడో భాగం ఉంటుందట. ఈ విషయం ‘ఇండియన్-2’లో నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్ స్వయంగా వెల్లడించాడు. ‘ఇండియన్-3’ ఉంటుందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. కానీ దానిపై క్లారిటీ లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని.. దీని కథ విస్తృతి ఎక్కువ అని.. కాబట్టి ‘ఇండియన్-3’ కూడా వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు కమల్ హాసన్ కొత్తగా 40 రోజుల డేట్లు ఇచ్చాడని.. షూటింగ్ జరుగుతోందని.. శంకర్, కమల్ ఇద్దరూ కూడా ఔట్పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఈ సినిమాకు మూడో భాగం చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అతనన్నాడు.
ఇండియన్-2 వచ్చే ఏప్రిల్లో రిలీజవుతుందని ఉదయనిధి ధ్రువీకరించాడు. ఇండియన్-2కు ఒక చోట బ్రేక్ ఇచ్చి.. ఇందులో మిగిలిన కంటెంట్కు మరికొంత జోడించి ఇండియన్-3ని సెట్ చేయాలన్నది శంకర్ ఆలోచన అట. ఇండియన్-3ని కూడా వచ్చే ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని కూడా శంకర్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…