‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో విక్రాంత్ వంటి యంగ్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్గానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను విక్రాంత్ అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్లు హీరోయిన్లుగా నటించారు.
హృదయం, ఖుషి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో ప్రసిద్ద నటుడైన గురు సోమసుందరం ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతోంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. దీంతో సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది.
ఇప్పటి వరకు వచ్చిన నాలుగు పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఐదో పాటను విడుదల చేశారు. ‘రాధేశా’ అంటూ సాగే ఈ పాట విక్రాంత్, మెహరీన్ మధ్య ప్రేమ, విరహ బాధను చూపించేలా ఉంది. విక్రాంత్ కోసం లేఖ పడే తాపత్రయాన్ని చూపించారు.
హేషమ్ అందించిన బాణీ.. శ్వేతా మోహన్ గాత్రం.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. ఈ పాటను ఎంతో మాధుర్యంగా మార్చాయి. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.
This post was last modified on November 8, 2023 9:10 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…