‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో విక్రాంత్ వంటి యంగ్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్గానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను విక్రాంత్ అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్లు హీరోయిన్లుగా నటించారు.
హృదయం, ఖుషి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో ప్రసిద్ద నటుడైన గురు సోమసుందరం ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతోంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. దీంతో సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది.
ఇప్పటి వరకు వచ్చిన నాలుగు పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఐదో పాటను విడుదల చేశారు. ‘రాధేశా’ అంటూ సాగే ఈ పాట విక్రాంత్, మెహరీన్ మధ్య ప్రేమ, విరహ బాధను చూపించేలా ఉంది. విక్రాంత్ కోసం లేఖ పడే తాపత్రయాన్ని చూపించారు.
హేషమ్ అందించిన బాణీ.. శ్వేతా మోహన్ గాత్రం.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. ఈ పాటను ఎంతో మాధుర్యంగా మార్చాయి. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.
This post was last modified on November 8, 2023 9:10 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…