‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో విక్రాంత్ వంటి యంగ్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్గానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను విక్రాంత్ అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్లు హీరోయిన్లుగా నటించారు.
హృదయం, ఖుషి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో ప్రసిద్ద నటుడైన గురు సోమసుందరం ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతోంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. దీంతో సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది.
ఇప్పటి వరకు వచ్చిన నాలుగు పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఐదో పాటను విడుదల చేశారు. ‘రాధేశా’ అంటూ సాగే ఈ పాట విక్రాంత్, మెహరీన్ మధ్య ప్రేమ, విరహ బాధను చూపించేలా ఉంది. విక్రాంత్ కోసం లేఖ పడే తాపత్రయాన్ని చూపించారు.
హేషమ్ అందించిన బాణీ.. శ్వేతా మోహన్ గాత్రం.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. ఈ పాటను ఎంతో మాధుర్యంగా మార్చాయి. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.
This post was last modified on November 8, 2023 9:10 pm
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…