టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దుర్యోగపరుస్తూ కొందరు చేస్తున్న ఇటువంటి చర్యలు తలుచుకుంటే భయమేస్తుందని బాలీవుడ్ బిగ్ అమితాబచ్చన్ స్పందించారు ఆయనతోపాటు వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ స్పందించింది. రష్మిక మందన్నకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అండగా నిలిచింది.
ఈ క్రమంలోనే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై హైదరాబాద్ డీజీపీ అంజనీ కుమార్ కు టాలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ రాంబాబులు అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అంజనీ కుమార్ అభినందించారు. ఈ కేసును సైబర్ క్రైం కు అప్పగించి దర్యాప్తు చేయమని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిపై చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హామీ ఇచ్చారు.
This post was last modified on November 8, 2023 8:42 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…