టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దుర్యోగపరుస్తూ కొందరు చేస్తున్న ఇటువంటి చర్యలు తలుచుకుంటే భయమేస్తుందని బాలీవుడ్ బిగ్ అమితాబచ్చన్ స్పందించారు ఆయనతోపాటు వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ స్పందించింది. రష్మిక మందన్నకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అండగా నిలిచింది.
ఈ క్రమంలోనే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై హైదరాబాద్ డీజీపీ అంజనీ కుమార్ కు టాలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ రాంబాబులు అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అంజనీ కుమార్ అభినందించారు. ఈ కేసును సైబర్ క్రైం కు అప్పగించి దర్యాప్తు చేయమని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిపై చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హామీ ఇచ్చారు.
This post was last modified on November 8, 2023 8:42 pm
దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…