టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దుర్యోగపరుస్తూ కొందరు చేస్తున్న ఇటువంటి చర్యలు తలుచుకుంటే భయమేస్తుందని బాలీవుడ్ బిగ్ అమితాబచ్చన్ స్పందించారు ఆయనతోపాటు వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ స్పందించింది. రష్మిక మందన్నకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అండగా నిలిచింది.
ఈ క్రమంలోనే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై హైదరాబాద్ డీజీపీ అంజనీ కుమార్ కు టాలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ రాంబాబులు అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అంజనీ కుమార్ అభినందించారు. ఈ కేసును సైబర్ క్రైం కు అప్పగించి దర్యాప్తు చేయమని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిపై చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హామీ ఇచ్చారు.
This post was last modified on November 8, 2023 8:42 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…