ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్లను నిర్దేశించేది సక్సెస్ లే. అవి ఉంటేనే అవకాశాలు క్యూ కడతాయి. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకుని తర్వాత వరస ఫ్లాపులతో కృతి శెట్టి ఏమయ్యిందో ఠక్కున చెప్పడం కష్టం. చేతిలో ఒకటో రెండో సినిమాలున్నాయి కానీ స్టార్ హీరోలలు తనను ఆప్షన్ గా చూడటం మానేశారు. తనకే ఇలా ఉంటే ఇక మెహ్రీన్ గురించి చెప్పేదేముంది. గతంలో రవితేజ, నాని, వరుణ్ తేజ్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నాగ శౌర్య, గోపిచంద్ లాంటి స్టార్లతో నటించి ఇప్పుడు అవకాశాలు లేకుండా అయిపోయింది. కొత్త హీరోతో నటించిన స్పార్క్ 17న విడుదల కానుంది.
ఎఫ్2 హిట్ అయ్యాక టాలీవుడ్ లో సెటిలైపోయినట్టేనని మెహ్రీన్ భావించింది. అయితే డిజాస్టర్లు క్యూ వరసగా పలకరించడం వల్ల ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పైగా భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దు చేసుకోవడం లాంటి వ్యక్తిగత అంశాలు కొంత ప్రభావం చూపించాయి. ఈ మధ్యే హాట్ స్టార్ వెబ్ సిరీస్ సుల్తాన్ అఫ్ ఢిల్లీతో ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆధర చుంబనాలకు సైతం ఓకే చెప్పింది కానీ పనవ్వలేదు. మీర్జాపూర్ రేంజ్ లో బ్లాక్ బస్టరవుతుందేమో అనుకుంటే దాని రివ్యూలు, రిపోర్టులు ఆశాజనకంగా లేవు. దీంతో అక్కడా నిరాశ తప్పలేదు.
సో ఏ బ్రేక్ దొరకాలన్నా అది స్పార్క్ చేతిలోనే ఉంది. ట్రైలర్ చూస్తేనేమో వెరైటీగా ఉంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఏదో కమర్షియల్ టచ్ తో ప్రయోగం చేశారు. ప్రమోషన్లు గట్రా చేస్తున్నారు కానీ ఆడియన్స్ ని మొదటి రోజు థియేటర్లకు రప్పించడం సవాలే. పైగా అజయ్ భూపతి మంగళవారం అదే రోజు క్లాష్ అవుతోంది. దానికున్న బజ్ తో పోల్చుకుంటే స్పార్క్ ఎదురీదాల్సి ఉంటుంది. ఎక్స్ ట్రాడినరీ అనే టాక్ తెచ్చుకోవాలి. ఒకప్పుడు మీడియం రేంజ్ స్టార్ హీరోలతో జట్టు కట్టి ఇప్పుడు కొత్త హీరోతో హిట్టు పడాలని కోరుకుంటున్న మెహ్రీన్ కు ఇదైనా కోరుకున్న బ్రేక్ ఇస్తుందో లేదో వచ్చే వారం తేలిపోతుంది.
This post was last modified on November 8, 2023 8:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…