హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాగా ఎన్బికె 109 మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇవాళ షూటింగ్ ప్రారంభానికి సంకేతంగా ఒక ప్రీ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సంగీత దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. మూడు ఆప్షన్లు తీవ్ర పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్స్ కి తమన్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్. నాగవంశీ, త్రివిక్రమ్ లతో చాలా బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి రికమండేషన్ సహజంగానే తన వైపు ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదు.
ఇక్కడో పాయింట్ ఏంటంటే అఖండ రేంజ్ లో మిగిలిన రెండు బాలయ్య సినిమాలకు తమన్ అంత మేజిక్ చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే కానీ పాటల పరంగా పూర్తి సంతృప్తినివ్వలేదన్నది వాస్తవం. అందుకే బాబీ మార్పు కోసం అనిరుధ్ ని ట్రై చేద్దామని అంటున్నాడట. అతనేమో మాములు బిజీగా లేడు. దేవర, విజయ్ దేవరకొండ 12 మ్యూజిక్ సిట్టింగ్స్ కే టైం దొరక్క దర్శక నిర్మాతలు వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. అలాంటప్పుడు 2024 వేసవి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకున్న బాలయ్య మూవీ ఆ టార్గెట్ చేరుకోవడం కష్టం. ఎంత ఒత్తిడి పెడితే అనిరుధ్ నుంచి అంత అవుట్ ఫుట్ తేడా కొడుతుందని చెన్నై టాక్.
ఇక మిగిలిన రైట్ ఆప్షన్ దేవిశ్రీ ప్రసాదే అవుతాడు. వాల్తేరు వీరయ్యకు తనిచ్చిన ట్యూన్లు, బీజీఎమ్ దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. బాబీకి తనతో మంచి సింక్ ఉంది. ఒకవేళ తమన్, దేవి ఇద్దరిలో ఒకరు కావాలంటే బహుశా రెండో పేరుకే ఓటు వేసే ఛాన్స్ ఉంది. ఇది తేలలేదు కాబట్టే పోస్టర్ లో పేరు లేకుండా వదలాల్సి వచ్చింది. బాలయ్య తొంభై రోజుల కాల్ షీట్స్ తో మొత్తం షూట్ పూర్తి చేసేలా బాబీ ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఏపీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆలోగానే వీలైనంత ఫినిష్ చేసి ఒత్తిడి లేకుండా చూసుకునేలా సితార బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.
This post was last modified on November 8, 2023 4:03 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…